News April 29, 2024

రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బ ఖాయం: అమిత్ షా

image

మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలతో నీచ రాజకీయాలు చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ కూటమి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని పేర్కొన్నారు. SC, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆయన చెప్పినట్లుగా ఎడిట్ చేసిన ఓ వీడియోపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.

Similar News

News December 15, 2025

వంజరపల్లిలో ఉపసర్పంచ్ ఎన్నిక.. ఇతనే సర్పంచ్ నా ఇక..?

image

వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లిలో మోర్తల చందర్ రావు ఆరో వార్డు నుంచి గెలిచి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీకి రిజర్వ్ కావడంతో గిరిజనులు లేకపోవడం కారణంగా సర్పంచ్ పదవికి ఎవరూ నామినేషన్ వేయలేదు. ఇదే పరిస్థితితో 1, 4, 5 వార్డుల్లోనూ ఎస్టీకి రిజర్వు కాగా నామినేషన్లు నమోదు కాలేదు. గ్రామంలో 2, 3, 6, 7, 8 వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. దీంతో సర్పంచ్ ఇతనేనా..?

News December 15, 2025

బిగ్‌బాస్‌ హౌస్‌లో టాప్‌-5 వీళ్లే

image

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 9 చివరి దశకు చేరుకుంది. ఫైనల్‌కు మరో వారం మాత్రమే మిగిలి ఉండగా టాప్‌-5 ఫైనలిస్టులు ఖరారయ్యారు. తనూజ, డిమోన్‌ పవన్‌, కళ్యాణ్‌, ఇమ్మాన్యుయేల్‌, సంజన ఫైనల్‌ రేసులోకి అడుగుపెట్టారు. తాజాగా జరిగిన డబుల్‌ ఎలిమినేషన్‌లో శనివారం <<18553037>>సుమన్‌శెట్టి<<>> ఇంటి నుంచి బయటకు వెళ్లగా, ఆదివారం <<18559680>>భరణి<<>> ఎలిమినేట్‌ అయ్యారు. దీంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.

News December 15, 2025

ఖమ్మం జిల్లాలో TDP మద్దతుదారు విజయం

image

TG: ఖమ్మం జిల్లా కామేపల్లి మేజర్ గ్రామ పంచాయతీని టీడీపీ సొంతం చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో TDP బలపరిచిన అభ్యర్థి అజ్మీర బుల్లి విజయం సాధించారు. బీజేపీ, BRS, జనసేన పార్టీల మద్దతుతో గెలిచినట్లు తెలుస్తోంది. ఏడేళ్ల క్రితం ఆమె భర్త హరినాయక్ సర్పంచ్‌గా గెలవగా, ఇప్పుడు బుల్లి గెలుపొందారు. కాగా మొదటి విడతలో ఖమ్మం జిల్లాలో టీడీపీ మద్దతుదారులు మూడు పంచాయతీలను సొంతం చేసుకున్నారు.