News May 24, 2024

6 నెలల్లోనే కాంగ్రెస్ మోసాలు బట్టబయలు: హరీశ్ రావు

image

TG: అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కాంగ్రెస్ మోసాలు బట్టబయలయ్యాయని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. ఆ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు చూస్తున్నారని చెప్పారు. ‘రాష్ట్రంలోని మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులను కాంగ్రెస్ నిలువునా మోసగించింది. గ్యారంటీలు అమలు చేయలేక చేతులెత్తేసింది. ఎన్నికల హామీలను ఆ పార్టీ తుంగలో తొక్కుతోంది. రేవంత్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి’ అని ఆయన విమర్శించారు.

Similar News

News February 19, 2025

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోకి నకిలీ పోలీస్

image

TG: కానిస్టేబుల్‌ని అంటూ ఓ వ్యక్తి పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌లోకి ప్రవేశించాడు. గోవర్ధన్ అనే అతను కానిస్టేబుల్ అని చెప్పి జ్ఞాన సాయి ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.3లక్షలు తీసుకున్నాడు. అతణ్ని నమ్మించడానికి CM సమీక్ష జరుగుతున్నప్పుడే CCCలోకి వెళ్లి వచ్చాడు. ఆపై అతను కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు CCTV ఫుటేజ్ పరిశీలించగా నిందితుడి చిత్రాలు నమోదయ్యాయి.

News February 19, 2025

మోదీని కలిసిన రిషి సునాక్ ఫ్యామిలీ

image

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ కుటుంబ సమేతంగా కలిశారు. వారి వెంట సునాక్ అత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా బ్రిటన్ మాజీ ప్రధాని ఫ్యామిలీతో కలిసి భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

News February 19, 2025

ALL TIME RECORD

image

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. చరిత్రలో తొలిసారిగా ఇవాళ ఉదయం 7 గంటలకు 16,058 మెగావాట్ల మైలురాయిని చేరుకుంది. ఈ నెల 10న నమోదైన 15,998 మెగావాట్ల రికార్డును రాష్ట్రం అధిగమించింది. దీంతో విద్యుత్ సరఫరాపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. ఎంత పెరిగినా దానికి తగ్గట్లు సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు.

error: Content is protected !!