News March 1, 2025
సంపద సృష్టిపై నిత్యం ఆలోచిస్తున్నా: సీఎం

AP: కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 12.9% వృద్ధి రేటు సాధించామని CM చంద్రబాబు తెలిపారు. YCP హయాంలో రోడ్లన్నీ గుంతలమయమైతే తాము మరమ్మతులు చేశామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. సంపద ఎలా సృష్టించాలనే దానిపై నిత్యం ఆలోచిస్తున్నామని పునరుద్ఘాటించారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా పేదల జీవితాల్లో మార్పులు తెస్తామని చెప్పారు.
Similar News
News March 25, 2025
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అవసరం లేదనిపించింది: ధోనీ

IPLలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రూల్ను ప్రకటించినప్పుడు అవసరం లేదని అనిపించింది. టోర్నీ మంచి పొజిషన్లోనే ఉంది. TRP కూడా బాగుంది. అలాంటప్పుడు ఇంకా మసాలా యాడ్ చేయడమెందుకు అని అనుకున్నా. ప్రస్తుతం ఈ రూల్ నాకు హెల్ప్ అవ్వదు. ఎందుకంటే నేను బ్యాటింగ్, కీపింగ్ రెండూ చేస్తున్నా. టోర్నీలో హైస్కోర్లు నమోదవడానికి పిచ్ పరిస్థితులే కారణం. ఈ రూల్ కాదు’ అని పేర్కొన్నారు.
News March 25, 2025
నేను క్షమాపణ చెప్పను: కునాల్ కమ్రా

మహారాష్ట్ర Dy.CM ఏక్నాథ్ షిండేపై తాను చేసిన వ్యాఖ్యలను కమెడియన్ <<15868229>>కునాల్ కమ్రా<<>> సమర్థించుకున్నారు. క్షమాపణలు చెప్పబోనని ఓ ప్రకటన విడుదల చేశారు. ‘భావ వ్యక్తీకరణ హక్కు అనేది శక్తివంతమైన వారిని ప్రశంసించడానికి మాత్రమే కాదు. రాజకీయ నేతలపై వ్యంగ్యంగా మాట్లాడడం చట్టవిరుద్ధం కాదు. షిండే గురించి అజిత్ పవార్ ఏం అన్నారో అదే నేనూ చెప్పాను. అయినా పోలీసులు, కోర్టుకు సహకరిస్తాను’ అని పేర్కొన్నారు.
News March 25, 2025
ట్రంప్ మరో కీలక నిర్ణయం.. భారత్కు షాక్?

US అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వెనెజువెలా నుంచి చమురును కొనే దేశాలు ఇకపై తమతో చేసే ఏ వాణిజ్యంలోనైనా 25శాతం అదనపు సుంకం కట్టాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆ దేశం అమెరికాకు శత్రుత్వం పాటిస్తోందని వివరించారు. వెనెజువెలా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసే దేశాల్లో భారత్ కూడా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం భారత్కు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంది.