News March 17, 2024
16 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

AP: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 16 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడించారు. ‘ఇండియా’ కూటమిలోని పార్టీలతో చర్చించిన అనంతరం అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. మంగళగిరిలో తమ పార్టీ కచ్చితంగా పోటీలో ఉంటుందని ప్రెస్మీట్లో చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీతో పాటు ఎన్డీఏ కూటమిలోని పార్టీలను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News April 8, 2026
90 లక్షల టన్నుల ధాన్యం కొంటాం: ఉత్తమ్

TG: రబీలో 90 లక్షల టన్నుల ధాన్యం కొంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 16 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సన్నరకాలకు మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇస్తామని పేర్కొన్నారు. రైతులకు 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తామని అన్నారు. MSP ఇవ్వని మిల్లర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
News April 8, 2026
ట్రంప్.. యుద్ధం వల్ల ఏం సాధించావ్?

ఇరాన్తో యుద్ధం ద్వారా ట్రంప్ ఏం సాధించారన్న ప్రశ్న తలెత్తుతోంది. యుద్ధం ముందు వరకు హార్ముజ్ నుంచి నౌకల రవాణా సాఫీగా సాగేది. ప్రపంచంలో ఎలాంటి ఆయిల్, గ్యాస్, ఎనర్జీ కొరత ఉండేది కాదు. FEB 28న వార్ స్టార్ట్ చేయగానే ఇరాన్ హార్ముజ్ను బంద్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం మొదలైంది. ఇప్పుడు తమ ఆర్మీ పర్యవేక్షణలోనే హార్ముజ్ ద్వారా రాకపోకలు సాగుతాయని ఇరాన్ సీజ్ఫైర్ ఒప్పందంలో షరతు పెట్టింది.
News April 8, 2026
సీజ్ఫైర్.. ట్విస్ట్ ఇచ్చిన నెతన్యాహు

ఇరాన్తో అమెరికా సీజ్ఫైర్ను స్వాగతించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రెండు వారాల సీజ్ఫైర్ లెబనాన్కు వర్తించదని స్పష్టం చేశారు. మరోవైపు సీజ్ఫైర్ లెబనాన్కు కూడా వర్తిస్తుందని మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ అంతకుముందు ప్రకటించారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు లెబనాన్లో దాదాపు 1,500 మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.


