News August 15, 2024

బెంగళూరులో పేలిన కుక్కర్.. NIA క్రాస్ ఎగ్జామినేషన్

image

బెంగ‌ళూరు జేపీ న‌గ‌ర్‌లోని ఉడుపి ఉపాహార్ రెస్టారెంట్ సమీపంలో కుక్క‌ర్ పేలి ఒకరు మృతి చెందిన ఘ‌ట‌న‌పై జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (NIA) క్రాస్ ఎగ్జామినేష‌న్ చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ఉగ్ర‌కోణం లేద‌ని పోలీసులు స్ప‌ష్టం చేసినా ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఇటీవ‌ల రామేశ్వ‌రం కేఫెలో ఉగ్ర‌వాదులు ఐఈడీ బాంబుల‌తో పేలుళ్ల‌కు కుట్ర‌ప‌న్నిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ ఘటనపై NIA క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.

Similar News

News January 27, 2026

రైలు ఆలస్యంతో పరీక్షకు గైర్హాజరు.. విద్యార్థినికి రూ.9లక్షల పరిహారం

image

UPలోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి అనే విద్యార్థిని 7ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత రైల్వేపై కేసు గెలిచింది. 2018లో రైలు ఆలస్యం వల్ల ఆమె Bsc ప్రవేశ పరీక్ష రాయలేకపోయింది. దీంతో పరిహారం కోరుతూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. రైలు ఆలస్యమవడంపై అధికారుల నుంచి సరైన వివరణ రాకపోవడంతో ఆమెకు 45 రోజుల్లో రూ.9.10L చెల్లించాలని కోర్టు ఆదేశించింది. చెల్లింపు ఆలస్యమైతే 12% వడ్డీ చెల్లించాలని పేర్కొంది.

News January 27, 2026

జనవరి 27: చరిత్రలో ఈరోజు

image

1922: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ జననం
1927: తెలుగు కవి, రచయిత పోతుకూచి సాంబశివరావు జననం
1936: కథా, నవలా రచయిత్రి కోడూరి కౌసల్యాదేవి జననం
2009: భారత మాజీ రాష్ట్రపతి రామస్వామి వెంకట్రామన్ మరణం
2023: సినీ నటి జమున మరణం (ఫొటోలో)
* కుటుంబ అక్షరాస్యత దినోత్సవం

News January 27, 2026

పొలిటికల్ వెపన్‌లా సిట్ నోటీసులు: హరీశ్ రావు

image

TG: రేవంత్ ప్రభుత్వం సిట్ నోటీసుల్ని పొలిటికల్ వెపన్‌లా వాడుతోందని హరీశ్ రావు అన్నారు. కోల్ స్కామ్‌పై ప్రశ్నించడంతో పబ్లిక్ అటెన్షన్‌ను డైవర్ట్ చేసేందుకు తనకు, KTRకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఈ స్కామ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని BRS నిర్ణయించిన కొన్ని గంటల్లోనే మాజీ ఎంపీ సంతోష్‌కు నోటీసులు వచ్చాయన్నారు. కాగా మంగళవారం గవర్నర్‌ను కలిసి సింగరేణి కుంభకోణంపై వివరాలు ఇవ్వనున్నట్లు BRS తెలిపింది.