News April 5, 2024

నేడు కూటమి పార్టీల సమన్వయ సమావేశాలు

image

AP: టీడీపీ, బీజేపీ, జనసేన పార్లమెంట్ స్థాయి సమన్వయ సమావేశాలు ఈరోజు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ స్థాయిలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూటమి నేతలు కార్యాచరణ రూపొందించనున్నారు. కూటమి నిర్వహణ, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారంపై చర్చించనున్నారు.

Similar News

News January 20, 2025

DANGER: రోజూ ఒకే సమయానికి నిద్ర పోవట్లేదా?

image

చాలామంది ఉద్యోగులు షిఫ్టుల వల్ల నిత్యం ఒకే సమయానికి నిద్రపోరు. దీన్నే ‘సోషల్ జెట్‌లాగ్’ అంటారు. ఒక వారంలో నిద్రపోయే సమయాల్లో 90 నిమిషాలు తేడా వస్తే శరీరంలో మైక్రోబయోటా జాతులు ఉత్పత్తి అవుతాయని సైంటిస్టులు గుర్తించారు. అలాంటివారికి ఎక్కువగా చిప్స్, షుగరీ ఫుడ్స్‌ తినాలనిపిస్తుందని తెలిపారు. ఫలితంగా సరైన ఆహారం తీసుకోలేకపోవడం, ఊబకాయం, కడుపులో మంట, స్ట్రోక్ ముప్పు తలెత్తవచ్చని సైంటిస్టులు తేల్చారు.

News January 20, 2025

ఇన్ఫోసిస్‌లో జీతాలే పెరగవు.. మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్

image

ఇన్ఫోసిస్‌లో శాలరీ హైక్ చాలా తక్కువని సంస్థ మాజీ ఉద్యోగి తెలిపారు. 9 ఏళ్లు పనిచేసి 2017లో రిజైన్ చేసేనాటికి తన జీతం రూ.35 వేలు మాత్రమేనన్నారు. వేరే టెక్ కంపెనీలో చేరగా 4 ఏళ్లలో నెల వేతనం రూ.1.75 లక్షలకు చేరిందని చెప్పుకొచ్చారు. క్యాబ్, పార్కింగ్ వంటి సదుపాయాలు కూడా ఇన్ఫోసిస్‌లో ఉండేవి కావన్నారు. ప్రస్తుత కంపెనీలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని రెడిట్‌లో ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

News January 19, 2025

రేషన్ కార్డులపై కీలక ప్రకటన

image

TG: అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ పారదర్శకంగా రేషన్ కార్డులు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకోసం ఇంకా ఎలాంటి జాబితా రెడీ కాలేదని తెలిపారు. ఖమ్మం(D) బనిగండ్లపాడులో మాట్లాడుతూ ఏ లిస్టు అయినా గ్రామ సభల్లోనే తయారవుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి వదంతులూ నమ్మొద్దన్నారు. అలాగే వ్యవసాయ యోగ్యమైన భూములకు షరతులు లేకుండా ఎకరానికి రూ.12వేలు ఇస్తామని పునరుద్ఘాటించారు.