News October 11, 2024
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య: పొంగులేటి

TG: GOVT స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ‘అమ్మ ఆదర్శ పథకం’ కింద ₹657 కోట్లు కేటాయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం(D) పొన్నెకల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమది చేతల ప్రభుత్వమని చెప్పారు. విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News November 13, 2025
భారీగా పెరిగిన కూరగాయల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు వినియోగదారులను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. చాలా రకాల కూరగాయలు పావుకేజీ రూ.30కి తక్కువ లభించడం లేదు. అంటే కేజీ రూ.100-120 పలుకుతోంది. రైతు బజార్లతోపాటు వారపు సంతల్లోనూ రేట్లు బెంబేలెత్తిస్తున్నాయి. ఆకుకూరల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇటీవల మొంథా తుఫాన్తో పంటలు తీవ్రంగా దెబ్బతినడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మీరూ కూరగాయల రేట్లతో షాక్ అయ్యారా?
News November 13, 2025
ఇతిహాసాలు క్విజ్ – 65

ఈరోజు ప్రశ్న: దేవవ్రతుడు ఎవరు? ఆయన ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఆ ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 13, 2025
ఐబీలో 258 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 258 ACIO పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 16 ఆఖరుతేదీ. B.E./B.Tech/M.Tech ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంటుంది. వెబ్సైట్: https://www.mha.gov.in/


