News November 12, 2024

అమృత్ టెండర్లలో అవినీతి పెద్ద జోక్: కోమటిరెడ్డి

image

TG: కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందనేది పెద్ద జోక్ అని చెప్పారు. ‘CM రేవంత్‌కు సృజన్ రెడ్డి తోకచుట్టం. కవిత, సృజన్ రెడ్డిలు వ్యాపార భాగస్వాములు. పాలమూరు టన్నెల్ పనులను వారిద్దరే చేశారు. దీనికి KTR సమాధానమివ్వాలి. అధికారులపై దాడులు, అమృత్ టెండర్లలో అవినీతి అని డైవర్షన్ పాలిటిక్స్‌ చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు.

Similar News

News July 8, 2025

నన్ను కూడా చంపేవారు: నల్లపురెడ్డి

image

AP: నెల్లూరు సుజాతమ్మ కాలనీలోని తన ఇంటిపై జరిగిన దాడి <<16984961>>ఘటనపై <<>>వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. ‘నెల్లూరు జిల్లాలో దాడి సంస్కృతి ఎప్పుడూ లేదు. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయం చేస్తారని అనుకోలేదు. నేను, నా కొడుకు బయటకెళ్లాక దాడి చేశారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారు. దాడి సమయంలో ఇంట్లో ఉన్న మా అమ్మను బెదిరించారు. ఇంట్లో ఉంటే నన్ను కూడా చంపేవారు’ అని ఆరోపించారు.

News July 8, 2025

తోడు కోసం పెళ్లి చేసుకుంటే రూ.28 కోట్లతో జంప్!

image

AP: చిత్తూరు(D) రాజుపేటకు చెందిన నాగమణి (50) గతంలో భర్త, కుమారుడిని కోల్పోయారు. శేష జీవితంలో తోడు కోసం పెళ్లి బ్రోకర్ ద్వారా ప్రకటన ఇచ్చారు. శేషాపురానికి చెందిన శివప్రసాద్‌(40) కరోనాతో తన భార్య చనిపోయిందని నమ్మించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులో నాగమణికి చెందిన రూ.10 కోట్ల విలువైన భూమి, రూ.15 కోట్ల అపార్ట్‌మెంట్ విక్రయించడంతో పాటు రూ.3 కోట్లు తీసుకుని పారిపోయాడు. ఆమె పోలీసులను ఆశ్రయించారు.

News July 8, 2025

కొత్త పంచాయతీ భవన నిర్మాణాలకు ఆమోదం

image

AP: సొంత భవనాలు లేని 417 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో భవనాన్ని రూ.32 లక్షలతో నిర్మించేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఇందులో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ నుంచి రూ.25 లక్షలు, ఉపాధి హామీ పథకం కింద రూ.7లక్షల నిధులను ఉపయోగించుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.