News June 5, 2024

అసెంబ్లీలో అవమానాన్ని భరించలేకపోయా: చంద్రబాబు

image

AP: అసెంబ్లీని వైసీపీ ప్రభుత్వం కౌరవ సభగా మార్చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘శాసనసభలో నాకు, నా కుటుంబానికి, నా భార్యకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయా. గతంలో నాపై బాంబులతో దాడి చేసినప్పుడూ ఇంత బాధపడలేదు. గెలిచి సీఎంగానే వస్తానని ఆనాడు ప్రతిజ్ఞ చేశా. దాన్ని నిజం చేయడానికి ప్రజలు తోడ్పడ్డారు. ఇప్పుడు మళ్లీ శాసనసభను గౌరవసభ చేస్తా’ అని చెప్పారు.

Similar News

News October 19, 2025

ధన్వంతరీ ఎవరు?

image

క్షీరసాగర మథనంలో జన్మించిన వారిలో ధన్వంతరి ఒకరు. ఆయన మహా విష్ణువు అంశ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆయన జన్మించారు. అందుకే ఆ రోజును ధన్వంతరి జయంతిగా జరుపుకొంటాం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం.. ధన్వంతరి, సూర్యభగవానుడి వద్ద ఆయుర్వేద జ్ఞానాన్ని పొందిన 16 మంది శిష్యులలో ఒకరు. ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి దైవంగా పూజించే ఆయనను స్మరించడం, ఆరాధించడం సకల రోగాల విముక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

News October 19, 2025

ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

ఏపీలో ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతిలో పడే అవకాశం ఉందని పేర్కొంది. అటు TGలోని కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఉమ్మడి MBNRలో రేపు 8.30amలోపు ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 19, 2025

ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు దగా చేశారు: వైసీపీ నేతలు

image

AP: ప్రభుత్వ <<18045253>>ఉద్యోగులను<<>> చంద్రబాబు మరోసారి దగా చేశారని వైసీపీ మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్, మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. 4 డీఏలు పెండింగ్‌లో ఉంటే ఒకటే చెల్లిస్తామని ప్రకటించారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి, ఇప్పుడు వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. తమపై విమర్శలు తప్ప, కూటమి ప్రభుత్వం సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏమి చేయట్లేదన్నారు.