News September 9, 2024
పటేల్ విగ్రహానికి పగుళ్లు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం భారీ వర్షాలకు కూలిపోవడంతో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కీ పగుళ్లు వచ్చాయని కొందరు పోస్టులు చేస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పగుళ్లు వచ్చాయని, ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఫొటోలు షేర్ చేయగా PIB FACTCHECK స్పందించింది. ఈ సమాచారం ఫేక్ అని, ఈ ఫొటోలు 2018లో నిర్మాణంలో ఉన్నప్పుడు తీసినవని క్లారిటీ ఇచ్చింది.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


