News November 28, 2024

CRASH MARKETS: రూ.4లక్షల కోట్ల నష్టం

image

స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన బెంచ్‌మార్క్ సూచీలు ప్రస్తుతం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 214 పాయింట్లు పతనమై 24,058, సెన్సెక్స్ 768 పాయింట్లు తగ్గి 79,456 వద్ద చలిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.4లక్షల కోట్లమేర నష్టపోయారు. అమెరికా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం, వడ్డీరేట్ల కోతలో US ఫెడ్ దూకుడు తగ్గిస్తుందన్న అంచనాలు, హెవీవెయిట్స్‌లో అమ్మకాలే ఇందుకు కారణం.

Similar News

News July 11, 2025

VJA: విచ్చలవిడిగా రూ.35 కోట్ల దుబారా..చివరికి.!

image

అద్విక ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకుడు ఆదిత్య కేసు దర్యాప్తులో పోలీసులు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి తెస్తున్నారు. డిపాజిటర్లను ఆకర్షించేందుకు రూ.35 కోట్లకుపైగా పలు ఉత్సవాలు, పుట్టినరోజు వేడుకలు, ఖరీదైన హోటల్ రూమ్‌లలో బస ఏర్పాట్లు, టూర్‌లను కంపెనీ నిర్వాహకులు చేపట్టినట్లు తెలుస్తోంది. 11 మంది కంపెనీ డైరెక్టర్‌లకు విల్లాలు కట్టడానికి ప్రణాళిక సిద్ధం చేయగా దివాళా తీయడంతో ముందుకెళ్లలేదు.

News July 11, 2025

ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

image

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <>ఆధార్ వెబ్‌సైట్‌లో<<>> ఆధార్ నంబర్, క్యాప్చా, OTPతో లాగిన్ అవ్వాలి. LOCK/ UNLOCK ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి బయోమెట్రిక్స్ తాత్కాలిక/పర్మినెంట్‌ లాక్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. CONSENT బాక్స్‌పై క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కితే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. SHARE IT

News July 11, 2025

జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

image

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్‌షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.