News December 28, 2024
రాజమౌళి SSMB29 నుంచి క్రేజీ అప్డేట్!
దేశంలోనే క్రేజీయెస్ట్ ప్రాజెక్టుగా ఇప్పటికే హైప్ దక్కించుకున్న రాజమౌళి-SSMB29 చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్కు ప్రియాంకా చోప్రా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అలాగే మరో కీలక పాత్రలో మలయాళ విలక్షణ నటుడు పృథ్విరాజ్ నటించనున్నట్లు ఫిలిం నగర్ టాక్. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సంక్రాంతి తరువాత జరగొచ్చని సమాచారం.
Similar News
News January 20, 2025
సైఫ్ ఇంట్లో నేడు క్రైమ్ సీన్ రీక్రియేషన్?
యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఇంట్లో పోలీసులు క్రైమ్ సీన్ రీక్రియేట్ చేస్తారని సమాచారం. అతడిపై కత్తితో అటాక్ చేసిన షరీఫుల్ను UPలో అరెస్టు చేశారు. అతడిని ఇప్పటికే ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. నేడు భారీ భద్రత నడుమ సైఫ్ ఇంటికి తీసుకెళ్తారని వార్తలు వస్తున్నాయి. నిందితుడు రెక్కీ, దాడికి ప్లాన్ చేసిన తీరును తెలుసుకోనున్నారు. మిస్టరీగా మారిన ఈ కేసులో తేలాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి.
News January 20, 2025
పైసా ప్రయోజనం లేకున్నా సొంత ఎలివేషన్లకు బాబు ఖర్చు: వైసీపీ
AP: చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా దావోస్ పర్యటనలో ప్రముఖులతో మీటింగులంటూ ఫొటోలతో భారీగా ప్రచారం చేసుకుంటారని వైసీపీ విమర్శించింది. వారు చెప్పినట్లుగా ఒక్క ఐటీ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు కాలేదని దుయ్యబట్టింది. మరోసారి చంద్రబాబు దావోస్ పర్యటనతో రాష్ట్రానికి పైసా ప్రయోజనం లేకపోయినా ఆయన సొంత ఎలివేషన్లకు ఏమాత్రం కొదవ లేకుండా భారీగా ఖర్చు చేస్తున్నారని మండిపడింది.
News January 20, 2025
Stock Markets: బ్యాంకు, ఫైనాన్స్ షేర్ల దూకుడు
స్టాక్మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ట్రంప్ ప్రమాణం, డాలర్ దూకుడు, Q3 ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. SENSEX 76,775 (+151), NIFTY 23,231 (+28) వద్ద చలిస్తున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా షేర్లకు డిమాండ్ ఉంది. ఆటో, FMCG, IT, మెటల్, ఫార్మా, హెల్త్కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. KOTAK, WIPRO టాప్ గెయినర్స్.