News August 29, 2024

40 ఏళ్లకు శ్రీనగర్‌లో క్రికెట్

image

40 ఏళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో టాప్ ప్లేయర్లు క్రికెట్ ఆడనున్నారు. వచ్చే నెల 20న మొదలయ్యే లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచులకు జోద్ పూర్, సూరత్, జమ్మూతో పాటు శ్రీనగర్‌(కశ్మీర్) వేదిక కానుంది. శిఖర్ ధవన్, దినేశ్ కార్తీక్ వంటి ప్లేయర్లు ఈ టోర్నీలో ఆడనున్నారు. మొత్తం ఆరు జట్లు 25 మ్యాచులు ఆడనుండగా అక్టోబర్ 10న ఫైనల్ మ్యాచ్ శ్రీనగర్‌లోని భక్షి స్టేడియంలో జరగనుంది.

Similar News

News February 16, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* 42 శాతం బీసీ రిజర్వేషన్లపై త్వరలో తీర్మానం: సీఎం రేవంత్
* ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: భట్టి
* BCలకు 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: కవిత
* మానవ మృగాలను కఠినంగా శిక్షిస్తాం: సీఎం చంద్రబాబు
* టీడీపీ నేతలను వేధించినవారిపై రెడ్‌బుక్ అమలు: మంత్రి లోకేశ్
* జీబీఎస్ కేసులపై ఆందోళన అవసరం లేదు: మంత్రి సత్యకుమార్

News February 16, 2025

తాజ్ మహల్‌ను సందర్శించిన రిషి సునాక్

image

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తాజ్‌ మహల్ సందర్శించారు. తన భార్య పిల్లలతో పాటు అత్తమ్మ సుధామూర్తితో కలిసి 90 నిమిషాల పాటు అక్కడ గడిపారు. ఈ పర్యటన తమ పిల్లలు ఎప్పటికీ మర్చిపోరని అతిథ్యానికి ధన్యవాదాలు అని విజిటర్‌ బుక్‌లో రాశారు. అయితే రిషి సునాక్ రేపు ఉదయం మరోసారి తాజ్‌మహల్ చూడటంతో పాటు ఆగ్రాలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని ప్రస్తుతం భారత పర్యటనలోఉన్నారు.

News February 16, 2025

KCR బర్త్‌డే రోజున సామాజిక కార్యక్రమాలు: KTR

image

TG: BRS అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా FEB 17న సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు KTR పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎవరికి తోచిన విధంగా వారు ఇతరులకు సహాయపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రక్తదాన శిబిరాలు పండ్ల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపట్టాలని KTR విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!