News December 24, 2024
భూ రికార్డుల్లో తప్పులు చేస్తే క్రిమినల్ కేసులు!
TG: ప్రభుత్వం ధరణి స్థానంలో ‘భూ భారతి’ చట్టాన్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ, మండలిలో ఆమోదం పొందిన ఈ చట్టం బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వం కఠిన నిబంధనలను పెట్టినట్లు తెలుస్తోంది. భూ రికార్డుల్లో తప్పులు చేస్తే అధికారులపై క్రిమినల్ కేసులతో పాటు ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు సమాచారం. ఏ స్థాయి అధికారి అయినా చర్యలు తప్పవని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News January 15, 2025
ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభం
ఢిల్లీలో AICC కొత్త కార్యాలయాన్ని సోనియా గాంధీ ప్రారంభించారు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దిగ్గజాలతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. 1978 నుంచి అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ ఆఫీసు ఉండేది. తాజాగా 9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు.
News January 15, 2025
హీరో పేరిట మోసం.. ₹7కోట్లు పోగొట్టుకున్న మహిళ!
తాను హాలీవుడ్ యాక్టర్ బ్రాడ్ పిట్నంటూ ఓ స్కామర్ ఫ్రెంచ్ మహిళ(53)ను మోసం చేశాడు. ఆన్లైన్ పరిచయం పెంచుకొని AI ఫొటోలు పంపి ఆమెను నమ్మించాడు. 2023 నుంచి రిలేషన్షిప్లో ఉన్నాడు. ఏంజెలినా జూలీతో డివోర్స్ వివాదం వల్ల క్యాన్సర్ చికిత్సకు సొంత డబ్బుల్ని వాడుకోలేకపోతున్నానని, మహిళ నుంచి ₹7cr రాబట్టాడు. తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ డిప్రెషన్తో ఆస్పత్రి పాలయింది. అధికారులకు ఫిర్యాదు చేసింది.
News January 15, 2025
Stock Markets: మెటల్, PSU బ్యాంకు షేర్లకు గిరాకీ
మోస్తరు లాభాల్లో మొదలైన బెంచ్మార్క్ సూచీలు ప్రస్తుతం రేంజుబౌండ్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,202 (+25), సెన్సెక్స్ 76,649 (+150) వద్ద ట్రేడవుతున్నాయి. సెక్టోరల్ ఇండైసెస్ మిశ్రమంగా ఉన్నాయి. మెటల్, PSU BANK, ఆటో, O&G షేర్లకు డిమాండ్ ఉంది. FMCG, ఫార్మా, హెల్త్కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి. NTPC, మారుతీ, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ADANI SEZ టాప్ గెయినర్స్. BAJAJ TWINS టాప్ లూజర్స్.