News December 19, 2024

క్రేజ్‌ను క్యాచ్ చేసుకుంటోన్న CROCS

image

CROCS కంపెనీ చెప్పుల గురించి యువతకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది వీటిని ధరించేందుకు ఇష్టపడుతుంటారు. దీంతో ఈ అమెరికన్ కంపెనీ వ్యాపారం భారీగా పెరిగిపోతోంది. 2019లో $1.23 బిలియన్‌గా ఉన్న క్రాక్స్ బిజినెస్ 2023లో మూడింతలు పెరిగి $3.96 బిలియన్ల వ్యాపారం చేసింది. ఈ ఏడాది ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ చెప్పుల ధర రూ.2500 – రూ.10000 వరకు ఉంటుంది.

Similar News

News November 26, 2025

కస్టమర్లను అలర్ట్ చేసిన SBI

image

తమ పేరుతో వాట్సాప్‌లో APK ఫైల్స్ పంపుతూ మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతుండటంపై SBI స్పందించింది. KYC అప్డేట్, రివార్డ్ పాయింట్స్ అంటూ సైబర్ నేరగాళ్లు పంపే SMS/వాట్సాప్ మెస్సేజ్‌లను నమ్మి మోసపోవద్దని సూచించింది. SBI ఎప్పుడూ apk ఫైల్స్ & లింక్స్ పంపదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫైల్స్‌ను క్లిక్ చేస్తే డేటా అంతా నేరగాళ్లకు చేరుతుందని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మోసపోతే 1930కి కాల్ చేయాలని కోరింది.

News November 26, 2025

iBOMMA రవి కేసులో ట్విస్ట్.. పైరసీ చేయకుండా..!

image

iBOMMA రవి నేరుగా సినిమాలు పైరసీ చేయలేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్, మూవీరూల్జ్, తమిళ్‌ఎంవీ లాంటి పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసేవాడని తెలిపారు. క్వాలిటీ తక్కువగా ఉన్న ఆ సినిమాలను టెక్నాలజీ సాయంతో HD క్వాలిటీలోకి మార్చి ఐబొమ్మ, బప్పం సైట్లలో పోస్ట్ చేసేవాడని చెప్పారు. అయితే గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు గుర్తించారు.

News November 26, 2025

Official: అహ్మదాబాద్‌లో కామన్ వెల్త్ గేమ్స్

image

2030 కామన్‌వెల్త్ గేమ్స్‌ ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్‌ అధికారికంగా ఖరారైంది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో నిర్వహించిన కామన్‌వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో 74 దేశాల ప్రతినిధులు ఇండియా బిడ్‌కు ఆమోదం తెలిపారు. ఇందులో 15-17 క్రీడలు ఉండనున్నాయి. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే గేమ్స్‌లో మాత్రం 10 స్పోర్ట్స్ ఉండనున్నాయి. కాగా 2030లో జరగబోయేవి శతాబ్ది గేమ్స్ కావడం గమనార్హం.