News September 23, 2024

3 రోజుల్లో పంట నష్టపరిహారం: మంత్రి పొంగులేటి

image

TG: కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో బీఆర్ఎస్ నేతల్లా తాము దోచుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నెలలు గడిచినా పంట నష్ట పరిహారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. రుణమాఫీ చేయకుండా మోసం చేశారని విమర్శించారు. 3 రోజుల్లో పంట నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పారు. అమృత్ టెండర్లలో తన సవాల్‌ను కేటీఆర్ స్వీకరించలేదని అన్నారు.

Similar News

News November 20, 2025

డాక్టర్ నిర్వాకం.. బాలుడికి ఫెవీక్విక్‌తో వైద్యం!

image

మీరట్‌(UP)లో జస్పిందర్ సింగ్‌ అనే వ్యక్తి కుమారుడు ఆడుతూ టేబుల్‌కు గుద్దుకున్నాడు. నుదుటిపై గాయం కావడంతో భాగ్యశ్రీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు రక్తం ఆపేందుకు గాయానికి ఫెవీక్విక్‌ వేసి వైద్యం చేశారని దంపతులు ఆరోపిస్తున్నారు. పిల్లాడి ఇబ్బంది చూసి మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా వాళ్లు 3 గంటలు కష్టపడి గాయాన్ని శుభ్రంచేసి 4 కుట్లు వేశారన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News November 20, 2025

పాము పొడ తెగులు నివారణ ఎలా?

image

మొక్కజొన్నలో పాముపొడ తెగులు నివారణకు నేలకు దగ్గరగా ఉన్న తెగులు సోకిన ఆకులను తొలగించి నాశనం చేయాలి. తర్వాత 200 గ్రా. కార్బెండజిమ్ (లేదా) 200 మి.లీ. ప్రోపికొనజోల్ మందును 200 లీటర్ల నీటికి కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఏటా ఈ తెగులు ఆశించే ప్రాంతాల్లో పంట విత్తిన 40 రోజుల తర్వాత తెగులు సోకకముందే ఈ మందులను పిచికారీ చేసుకోవాలని.. పంట చుట్టూ కలుపు మొక్కలను తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

News November 20, 2025

హిమాలయాలకే వెళ్తాం.. చాలామంది ట్రావెల్ డెస్టినేషన్ ఇదేనట!

image

‘అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ట్రావెల్’ విడుదల చేసిన అత్యంత ప్రతిష్ఠాత్మక ‘ట్రెండింగ్ డెస్టినేషన్స్ 2026’ జాబితాలో హిమాలయాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఆధ్యాత్మికత, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కలగలిసిన ఈ పర్వత శ్రేణులు వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువమంది యాత్రికులను ఆకర్షించనున్నాయని సంస్థ పేర్కొంది. ఇది భారత హిమశిఖరాలకు దక్కిన గొప్ప అంతర్జాతీయ గౌరవమని నెటిజన్లు కొనియాడుతున్నారు.