News November 30, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,417 మంది భక్తులు దర్శించుకోగా 23,096 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు చేకూరింది.

Similar News

News October 17, 2025

రోజుకు 5KM పరుగు… అయినా 2 స్టెంట్లు

image

రోజుకు 5 కి.మీ పరిగెత్తడం అతడి దినచర్య. నిద్ర, ఆహార నియమాలను తూ.చ పాటిస్తుంటాడు. 15 ఏళ్లుగా ఇదే పాటిస్తున్న కార్తీక్ శ్రీనివాసన్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ వైరలవుతోంది. హఠాత్తుగా అస్వస్థత అనిపించడంతో యాంజియోగ్రామ్ చేస్తే హార్ట్‌లో 2 బ్లాక్స్ ఉన్నట్లు తేలిందని, స్టెంట్లు వేశారని ఆయన పేర్కొన్నాడు. జాగ్రత్తలు తీసుకున్నా గుండె లయ తప్పిందన్నాడు. గుండె ఆరోగ్యం అనేక అంశాలతో ముడిపడి ఉంటుందనుకోవాలన్నాడు.

News October 17, 2025

గంభీర్‌తో రోహిత్.. క్యాప్షన్ ప్లీజ్!

image

టీమ్ ఇండియా కెప్టెన్సీ చేజారిన తర్వాత రోహిత్ శర్మ తొలిసారి కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి కనిపించారు. ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా గంభీర్.. హిట్‌మ్యాన్‌కు సలహాలు ఇచ్చారు. రోహిత్ సీరియస్‌గా చేతులు కట్టుకుని కోచ్ మాటలు విన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ.. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, లోకల్ బౌలర్లను ఎదుర్కొన్నారు. పై ఫొటోకు మీ క్యాప్షన్ ఏంటో కామెంట్ చేయండి.

News October 16, 2025

ధన త్రయోదశి.. ఈ వస్తువులు కొనవద్దు

image

దీపావళికి రెండ్రోజుల ముందు వచ్చే ధన త్రయోదశి రోజు (OCT 18) వెండి, బంగారం కొంటే మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. ఇదే సమయంలో కొన్నింటిని ఆరోజు కొనవద్దని పురోహితులు చెబుతున్నారు. ఇనుము శనికి చిహ్నం కావడంతో ఆరోజు కొనొద్దని అంటున్నారు. అలాగే గాజు (రాహు), స్టీల్, సూదులు, కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులు, నెయ్యి, నూనె, నల్ల రంగు దుస్తులు లేదా సామాగ్రి జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. Share It