News February 26, 2025

CT: గెలిస్తేనే నిలుస్తారు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టుకే సెమీస్ ఆశలు సజీవంగా ఉండనున్నాయి.
అఫ్గానిస్థాన్: గుర్బాజ్, ఇబ్రహీం, సాదిక్, రహ్మత్, హస్మత్, అజ్మత్, నబీ, గుల్బదిన్, రషీద్ ఖాన్, నూర్, ఫరూఖీ
ఇంగ్లండ్: డకెట్, సాల్ట్, స్మిత్, రూట్, బ్రూక్, బట్లర్, లివింగ్ స్టోన్, ఓవర్టన్, ఆర్చర్, రషీద్, వుడ్.

Similar News

News March 17, 2025

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్‌లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్‌లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 17, 2025

ఉగాది నుంచి పీ4 విధానం అమలు: సీఎం చంద్రబాబు

image

AP: ఉగాది నుంచి పీ4 విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు అన్నారు. పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తామని తెలిపారు. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళతామని వివరించారు. నియోజకవర్గాల వారీగా పీ4 అమలు కావాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారు. పేదరిక నిర్మూలనకు 10 సూత్రాలను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉమ్మడి APలో 2020 విజన్ వల్ల చెప్పిన దానికంటే ఎక్కువ ప్రయోజనం కలిగిందని చెప్పారు.

News March 17, 2025

రేపు మేదరమెట్లకు వైఎస్ జగన్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మేదరమెట్లలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. ఆమె మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న వైవీ సుబ్బారెడ్డి తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయల్దేరారు.

error: Content is protected !!