News March 28, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు కస్టడీ
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు కోర్టు కస్టడీ విధించింది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, భుజంగరావుకు 5 రోజుల కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. కానీ ప్రణీత్ రావు కస్టడీకి కోర్టు అనుమతించలేదు. కాగా నిందితులంతా తమ సొంత అవసరాలకు కూడా ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తలు, హవాలా దందా చేసేవారిని బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News October 4, 2024
మీ ప్రయాణం ఇంకెక్కడిదాకా స్వామీ: అంబటి
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా మరోసారి సెటైర్ వేశారు. ‘చె గువేరాతో ప్రారంభమై.. సనాతన ధర్మం వరకూ సాగిన మీ ప్రయాణం.. ఇంకెక్కడి దాకా స్వామీ?’ అంటూ ట్వీట్ చేశారు. కాగా ‘బాబు సిట్ను రద్దు చేసి సుప్రీంకోర్టు సిట్ వేయడాన్ని స్వాగతిస్తున్నాం’ అంటూ ఆయన మరో ట్వీట్ చేశారు.
News October 4, 2024
టాస్ ఓడిన టీమ్ ఇండియా
వుమెన్స్ టీ20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమ్ ఇండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్: షఫాలీ, స్మృతి, హర్మన్, రోడ్రిగ్స్, రిచా, దీప్తి, వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, అరుంధతి, రేణుకా సింగ్, ఆశా.
కివీస్: బేట్స్, ప్లిమ్మర్, అమేలియా కెర్, డివైన్(సి), హాలిడే, గ్రీన్, ఇసాబెల్లా, జెస్ కెర్, మెయిర్, ఈడెన్ కార్సన్, లీ తహుహు.
News October 4, 2024
భారీ ఎన్కౌంటర్.. 30 మంది మావోలు మృతి
మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 30 మంది మరణించారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలో బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.