News May 26, 2024
తీరం దాటుతున్న రెమాల్ తుఫాన్

బంగాళాఖాతంలో పుట్టిన రెమాల్ తుఫాన్ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతోంది. ఈరోజు అర్ధరాత్రికల్లా పూర్తిగా తీరంపైకి చేరుకుంటుందని బంగ్లా, భారత వాతావరణ శాఖలు ప్రకటించాయి. తీరప్రాంతాల వెంబడి గాలులు 90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఇప్పటికే అటు బంగ్లాదేశ్, ఇటు పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.
Similar News
News February 14, 2025
కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్?

చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ FEB 18న రిటైర్ కానున్నారు. దీంతో కొత్త CEC ఎంపిక కోసం PM మోదీ, లా మినిస్టర్ అర్జున్ మేఘ్వాల్, LOP రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ ఈ నెల 17న భేటీ కానుంది. 480 మంది నుంచి సెర్చ్ కమిటీ ఐదుగురిని షార్ట్ లిస్టు చేయనుంది. ఈ జాబితాలో 1988 బ్యాచ్ IAS ఆఫీసర్ జ్ఞానేశ్ కుమార్ ముందువరుసలో ఉన్నారు. ఈయన గతంలో కీలక పదవుల్లో పనిచేశారు. 2024 జనవరి 31న రిటైర్ అయ్యారు.
News February 14, 2025
తెలంగాణ ఉద్యమంపై పుస్తకాలు రావాలి: CM

తెలంగాణ ఉద్యమ చరిత్రపై మరిన్ని సమగ్రమైన పుస్తకాలు రావాలని CM రేవంత్ ఆకాంక్షించారు. మాజీ MP దేవేందర్ గౌడ్ రాసిన విజయ తెలంగాణ పుస్తకాన్ని CM ఆవిష్కరించారు. ‘TG ఉద్యమంపై లోతైన చర్చ జరగాలి. ఎన్నో వర్గాలు పాల్గొన్నా, ఒక కుటుంబమే పాల్గొన్నట్లు వక్రీకరించారు. ఉద్యమం టైంలో ప్రజలంతా తమ వాహనాలు, ఆఫీసులు, గుండెలపై TG అని రాసుకున్నారు. ఇప్పుడు ప్రజలు కోరుకున్నట్లుగానే TSను TGగా మార్చాం’ అని CM వెల్లడించారు.
News February 14, 2025
అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు

AP: రాజధాని అమరావతిని అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం లేదా CMO నామినేట్ చేసిన వారిని ఎంపిక చేయాలని ఉత్తర్వులిచ్చింది. వివిధ రంగాల్లో నిపుణులు, ప్రజల్లో మమేకమైన వారిని నైపుణ్యం, అర్హతల ఆధారంగా ఏడాది కాలానికి నియమించనున్నట్లు పేర్కొంది. అమరావతికి పెట్టుబడులను ఆకర్షించేందుకు వీరు కృషి చేయాల్సి ఉంటుంది.