News March 30, 2024
$100 బిలియన్లతో డేటా సెంటర్

మైక్రోసాఫ్ట్, ఓపెన్AI కలిసి $100 బిలియన్ల ఖర్చుతో అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నాయి. అలాగే AI సూపర్ కంప్యూటర్ ‘స్టార్గేట్’ను 2028లో లాంచ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాయి. ప్రపంచంలో ఉన్న పెద్ద డేటా సెంటర్ల కంటే ఇది 100 రెట్లు ఖరీదైనదని అంచనా. అడ్వాన్స్డ్ టాస్క్లు పూర్తి చేయగల AI డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ను భర్తీ చేయడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని ఉన్నతోద్యోగులు చెబుతున్నారు.
Similar News
News November 25, 2025
భిక్కనూర్: ‘ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి’

ప్రభుత్వం అందిస్తోన్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ విక్టర్ చెప్పారు. మంగళవారం భిక్కనూర్ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళలకు రూ.మూడున్నర కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు పోవాలని సూచించారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు.
News November 25, 2025
హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి: సిద్దరామయ్య

CM మార్పు విషయంలో గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉందని, వారు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని అన్నారు. అధిష్ఠానం నుంచి సిగ్నల్ రాగానే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు తాను పార్టీ నుంచి ఏమీ డిమాండ్ చేయడం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.
News November 25, 2025
UIDAIలో టెక్నికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(<


