News March 30, 2024
$100 బిలియన్లతో డేటా సెంటర్

మైక్రోసాఫ్ట్, ఓపెన్AI కలిసి $100 బిలియన్ల ఖర్చుతో అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నాయి. అలాగే AI సూపర్ కంప్యూటర్ ‘స్టార్గేట్’ను 2028లో లాంచ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాయి. ప్రపంచంలో ఉన్న పెద్ద డేటా సెంటర్ల కంటే ఇది 100 రెట్లు ఖరీదైనదని అంచనా. అడ్వాన్స్డ్ టాస్క్లు పూర్తి చేయగల AI డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ను భర్తీ చేయడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని ఉన్నతోద్యోగులు చెబుతున్నారు.
Similar News
News April 19, 2026
మూడు నెలల్లో 73,200 ఉద్యోగాలు ఉఫ్!

ఈ ఏడాదిలో తొలి మూడునెలల్లోనే 95 కంపెనీలు ఏకంగా 73,200 ఉద్యోగాల్లో కోత ప్రకటించినట్లు Layoffs.fyi వెల్లడించింది. ఏఐ వాడకం పెరగడం, కాస్ట్ కట్టింగే ఇందుకు కారణం. ఇందులో బడా కంపెనీలైన మెటా, ఒరాకిల్, స్నాప్, డిస్నీ కూడా ఉన్నాయి. ఒరాకిల్ దాదాపు 30వేల ఉద్యోగాలు కట్ చేసింది. ఇందులో భారత్లోనే 12వేల ఉద్యోగాలు ఉన్నట్లు సమాచారం. ఇక మెటాలో 2000+ ఉద్యోగాలు పోగా డిస్నీ 1000 మందిని తొలగించింది.
News April 19, 2026
రీఛార్జ్ ధరలను పెంచేసిన ఎయిర్టెల్

కస్టమర్లకు భారతీ ఎయిర్టెల్ షాకిచ్చింది. రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసింది. రూ.799 (1.5gb/రోజుకు) ప్లాన్ రేటును ఏకంగా రూ.100 పెంచేసి రూ.899గా నిర్ణయించింది. అటు రూ.859 ప్లాన్ను పూర్తిగా తొలగించింది. పెంచిన రేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.
News April 19, 2026
సెన్సస్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!

AP: కేంద్రం చేపట్టిన జనగణన పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని NTR జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రజలకు సూచించారు. సెన్సస్ సిబ్బందిమంటూ ఇళ్ల వద్దకు వచ్చి OTPలు అడిగితే చెప్పొద్దని, వేలిముద్రలు, ఐరిస్కు ఒప్పుకోవద్దని స్పష్టం చేశారు. అనుమానం ఉంటే 1855 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలన్నారు. కాగా ప్రస్తుతం <<19674967>>సెల్ఫ్ ఎన్యూమరేషన్<<>> జరుగుతుండగా, మే 1 నుంచి జనగణన మొదలవనుంది.


