News November 18, 2024
గ్రూప్-3 పరీక్షకు కూతురు హాజరు.. కిడ్నాప్ చేశామంటూ తండ్రికి ఫోన్

TG: ‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. రూ.20వేలు ఇస్తేనే వదిలిపెడతాం’ అంటూ మహబూబాబాద్కు చెందిన డోలి వెంకటేశ్వర్లుకు ఓ ఆగంతకుడు నిన్న ఫోన్ చేశాడు. అయితే అంతకుముందే ఆమెను సోదరుడు గ్రూప్-3 ఎగ్జామ్ సెంటర్ వద్ద వదిలివచ్చాడు. అనుమానం వచ్చిన వెంకటేశ్వర్లు కేంద్రం వద్దకు వెళ్లి పోలీసులకు విషయం చెప్పాడు. ఆమె ఎగ్జామ్ సెంటర్లోనే ఉందని వారు నిర్ధారించారు. దీంతో కిడ్నాప్ కాల్ సైబర్ నేరగాళ్ల పనేనని తేల్చారు.
Similar News
News December 1, 2025
13,217 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 13,217 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షల అడ్మిట్ కార్డులను IBPS విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14 తేదీల్లో ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి. కాగా ప్రస్తుతం ఉచిత మాక్ టెస్టులు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
వెబ్సైట్: https://www.ibps.in/
News December 1, 2025
మనకోసం మనకంటే ముందుగా (1/2)

మనిషి స్పేస్ జర్నీ ఈజీ చేసేందుకు మనకంటే ముందు కొన్ని ప్రాణులు స్పేస్లోకి వెళ్లాయి. 1947లో USA సైంటిస్ట్స్ ఫ్రూట్ ఫ్లైస్(ఓ జాతి ఈగ)ను పంపారు. రేడియేషన్, జీవక్రియ, ప్రత్యుత్పత్తి తదితరాలపై రీసెర్చ్ కోసం పంపిన అవి తిరిగొచ్చాయి. 1949లో కోతిని పంపగా పారాచూట్ ఫెయిలై వెనక్కి రాలేదు. 1957లో స్పుత్నిక్2లో వీధి కుక్క లైకాను రష్యా పంపింది. భూ కక్ష్యలో అడుగుపెట్టిన తొలి జంతువు ఆ వెదర్లో కొంతసేపే బతికింది.
News December 1, 2025
మనకోసం మనకంటే ముందుగా (2/2)

1960లో స్పుత్నిక్5తో వెళ్లిన డాగ్స్ బెల్కా, స్ట్రెల్కా తిరిగొచ్చాయి. మనుషులు స్పేస్ జర్నీ చేయగలరని వీటితోనే తెలిసింది. 1961లో నాసా ఓ చింపాంజీని పంపి మెదడు పనితీరు పరిశీలించింది. నరాల పనితీరుపై అధ్యయనం కోసం France 1963లో పిల్లిని, 2007లో యురోపియన్ స్పేస్ ఏజెన్సీ వాటర్ బేర్ను పంపింది. స్పేస్లో ఆక్సిజన్ కొరత, రేడియేషన్ను ఇవి తట్టుకున్నాయి.
-1961: యూరి గగారిన్ స్పేస్లోకి వెళ్లిన తొలి మనిషి


