News January 7, 2025
ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై అభ్యంతరాల గడువు పెంపు

AP: ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై అభ్యంతరాల సమర్పణ గడువును ఈ నెల 12 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుండటంతో మరో 5 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సర్వే వివరాలు ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల అనంతరం ఈ నెల 20వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు.
Similar News
News December 20, 2025
బడ్జెట్లో మీకేం కావాలి? ప్రభుత్వానికి సలహా ఇవ్వండి..!

కేంద్ర బడ్జెట్ 2026 కోసం భారత ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలు కోరుతోంది. దేశాభివృద్ధికి, కొత్త రూల్స్ తయారీకి మీ ఐడియాలను పంచుకోవాలని MyGovIndia Xలో పోస్ట్ చేసింది. అందరికీ ఉపయోగపడేలా బడ్జెట్ ఉండాలనేది ప్రభుత్వ ప్లాన్. ఆసక్తి ఉన్నవారు <
News December 20, 2025
వేంకన్న గుడికి గువాహటిలో 25 ఎకరాలు

AP: గువాహటిలో TTD ఆలయం కోసం 25 ఎకరాలు ఇచ్చేందుకు అస్సాం CM హిమంత బిశ్వశర్మ ఆమోదం తెలిపారు. ‘గతంలో వేరే పట్టణాల్లో స్థలం ఇస్తామన్నారు. అయితే రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలన్నది ఆశయమని, ఈశాన్య భారతానికి కేంద్రంగా ఉన్న గువాహటిలో స్థలం కేటాయించాలని CM CBN అస్సాం CMకు లేఖ రాశారు’ అని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భూమితో పాటు ఆర్థిక సహకారం అందించడానికి హిమంత అంగీకరించారని చెప్పారు.
News December 20, 2025
ఆయుష్ మార్క్ అంటే ఏమిటి?

బంగారం, వస్త్రాలు, అగ్రి ఉత్పత్తులు, మెడిసిన్ నాణ్యతను ధ్రువీకరించేందుకు హాల్ మార్క్, ISI, AGMARK, GMP లాంటి గుర్తులున్నాయి. ఇదే తరహాలో ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, సిద్ధ, యునాని, హోమియోపతి ఉత్పత్తులు, సేవల క్వాలిటీని Ayush Mark ద్వారా గుర్తించవచ్చు. 2009 నుంచే ఇది ఉన్నప్పటికీ గ్లోబల్ స్థాయి గుర్తింపు కోసం మోదీ సరికొత్తగా ప్రారంభించారు. ఇలాంటి వైద్యానికి వెళ్లినప్పుడు ఈ మార్క్ను గుర్తుంచుకోండి.


