News January 7, 2025

ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై అభ్యంతరాల గడువు పెంపు

image

AP: ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై అభ్యంతరాల సమర్పణ గడువును ఈ నెల 12 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుండటంతో మరో 5 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సర్వే వివరాలు ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల అనంతరం ఈ నెల 20వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు.

Similar News

News December 20, 2025

Y.పాలెం: ‘అన్ని అంశాలపై శ్రద్ధ చూపాలి’

image

ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం మండలంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు కేంద్ర ప్రభారి అధికారి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఆయన జిల్లా అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్రం నిర్దేశించిన 39 అంశాల్లో కొన్ని అంశాలలో 100% లక్ష్యాలను సాధించారని, మిగిలిన అంశాలపై కూడా శ్రద్ధ చూపాలని సూచించారు.

News December 20, 2025

నేడు జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. “పర్యావరణంలో అవకాశాలు” అనే థీమ్‌తో ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పరిశుభ్రత, ప్రజా ఆరోగ్యం, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రీసైక్లింగ్‌, వేస్ట్-టు-వెల్త్ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.

News December 20, 2025

నేడు జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. “పర్యావరణంలో అవకాశాలు” అనే థీమ్‌తో ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పరిశుభ్రత, ప్రజా ఆరోగ్యం, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రీసైక్లింగ్‌, వేస్ట్-టు-వెల్త్ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.