News April 29, 2024
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

AP: రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 25 లోక్సభ స్థానాలకు 503 మంది, 175 అసెంబ్లీ సీట్లకు 2,705 మంది పోటీలో ఉన్నారు. నంద్యాల పార్లమెంట్కు అత్యధికంగా 36 నామినేషన్లు, రాజమండ్రి ఎంపీ స్థానానికి అత్యల్పంగా 12 నామినేషన్లు దాఖలయ్యాయి. తిరుపతి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 48 నామినేషన్లు, చోడవరం ఎమ్మెల్యే స్థానానికి అత్యల్పంగా 6 నామినేషన్లు దాఖలయ్యాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News October 28, 2025
రాష్ట్రంలో మెగా జాబ్ మేళా

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తుళ్లూరులోని CRDA ఆఫీస్, స్కిల్ హబ్ వద్ద రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10 మల్టీ నేషనల్ కంపెనీలు 400 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. నిరుద్యోగ అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెజ్యూమ్, సర్టిఫికెట్లు తీసుకుని ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
News October 28, 2025
నిత్యారాధన ఫలితాలు

శివ మహాపురాణం ప్రకారం.. నిత్యారాధన విశేష ఫలితాలనిస్తుంది. ఆదివారం సూర్యారాధన నేత్ర, శిరో, చర్మ రోగాలను పోగొడుతుంది. అన్నదానం చేయడం శుభకరం. సంపద కోసం సోమవారం లక్ష్మీదేవిని, రోగ నివారణకై మంగళవారం కాళిని, కుటుంబ క్షేమం కోసం బుధవారం విష్ణువును, ఆయువుకై గురువారం, భోగాలకై శుక్రవారం సకల దేవతలను, అపమృత్యువు నివారణకై శనివారం రుద్రాది దేవతలను పూజించాలి. ఈ నిత్యారాధనలు మనకు సకల శుభాలు కలిగిస్తాయి. <<-se>>#SIVOHAM<<>>
News October 28, 2025
ఈ మందు ‘యమ’ డేంజర్

TG: రాష్ట్రంలో ఆత్మహత్యలకు వినియోగిస్తున్న పారాక్వాట్ గడ్డిమందును బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొన్నిగంటల్లోనే గడ్డిని మాడిపోయేలా చేసే ఈ మందును రైతులు వాడతారు. అయితే ఆత్మహత్యలకూ వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది తాగిన వెంటనే కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. విరుగుడు లేకపోవడంతో 98% కేసుల్లో మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశం కేరళ, ఒడిశాతో పాటు 32దేశాల్లో నిషేధం ఉంది.


