News March 17, 2024
బొబ్బిలిలో రైలు ఢీకొని మృతి

బొబ్బిలి ఇందిరమ్మకాలనీ సమీపంలో రైలు ఢీకొని వృద్దుడు తామాడ అప్పలస్వామి(68) మృతి చెందినట్లు రైల్వే హెచ్సి బి.ఈస్వరరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బాడంగి మండలం అనవరం గ్రామానికి చెందిన అప్పలస్వామి గొల్లపల్లి పెళ్లికి వెళ్లాడు. తిరిగు ప్రయాణంలో ఇందిరమ్మకాలనీ వద్ద రైల్వే పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని ట్రైన్ ఢీకొని మృతి చెందారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News March 10, 2026
విజయనగరం జిల్లాలో విస్తృతంగా హెచ్పీవీ టీకాలు

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం జిల్లాలో హెచ్పీవీ టీకాల కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా ఇవ్వనున్నట్లు, ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ మూడు నెలలు కొనసాగుతుందని తెలిపారు. పాఠశాలలు, అంగన్వాడీల ద్వారా అర్హులైన బాలికలను గుర్తించి టీకాలు వేస్తామన్నారు.
News March 9, 2026
VZM: డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 107 మందికి రూ.10.70 లక్షల ఫైన్

మద్యం సేవించి వాహనాలు నడిపిన 107 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా, న్యాయస్థానం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.10.70 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ సోమవారం తెలిపారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు విజయనగరం జిల్లాలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని, మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
News March 9, 2026
VZM: ‘పనిచేసిన 15 రోజుల్లోపే ఖాతాలో వేతనం’

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత భారత్-రోజ్గార్, ఆజీవిక మిషన్ చట్టంపై జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో 125 రోజుల ఉపాధి పని దినాల కల్పనకు పోస్టర్లు, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పిస్తామన్నారు. పని చేసిన 15 రోజుల్లోగా వేతనం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందన్నారు.


