News March 17, 2024
బొబ్బిలిలో రైలు ఢీకొని మృతి

బొబ్బిలి ఇందిరమ్మకాలనీ సమీపంలో రైలు ఢీకొని వృద్దుడు తామాడ అప్పలస్వామి(68) మృతి చెందినట్లు రైల్వే హెచ్సి బి.ఈస్వరరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బాడంగి మండలం అనవరం గ్రామానికి చెందిన అప్పలస్వామి గొల్లపల్లి పెళ్లికి వెళ్లాడు. తిరిగు ప్రయాణంలో ఇందిరమ్మకాలనీ వద్ద రైల్వే పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని ట్రైన్ ఢీకొని మృతి చెందారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News April 11, 2026
కేజీబీవీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు: డీఈవో

జిల్లాలోని కేజీబీవీలో 2026-27 ఏడాదికి 6,7,8,9,10, ఇంటర్మీడియట్లో ప్రవేశాల దరఖాస్తులను ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. రేపటితో ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ, విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బాలికలు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం పేర్కొన్నారు.
News April 11, 2026
ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు: జేసీ

ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లు, నెయ్యి విక్రయదారులు, స్వీట్, కిరాణా షాపులపై జేసీ సేతుమాధవన్ చర్యలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీరా నిర్వహించిన తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడటంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన జేసీ, నిందితుల సమక్షంలో రూ.1,04,000 జరిమానా విధించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు.
News April 11, 2026
ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు: జేసీ

ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లు, నెయ్యి విక్రయదారులు, స్వీట్, కిరాణా షాపులపై జేసీ సేతుమాధవన్ చర్యలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీరా నిర్వహించిన తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడటంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన జేసీ, నిందితుల సమక్షంలో రూ.1,04,000 జరిమానా విధించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు.


