News February 26, 2025

విమాన ప్రమాదంలో 46కు చేరిన మరణాలు

image

సూడాన్‌లో జరిగిన <<15582145>>విమాన ప్రమాదంలో<<>> మరణాల సంఖ్య పెరిగింది. ఓమ్డర్మన్ నగరంలో జరిగిన ఘటనలో మరణాలు 46కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడినట్లు వెల్లడించారు. పౌర నివాసాలపై విమానం కూలడంతో మిలిటరీ సిబ్బందితో పాటు పౌరులు చనిపోయారని పేర్కొన్నారు. 2023 నుంచి సూడాన్‌లో ఆర్మీకి ర్యాపిడ్ దళాలకు మధ్య యుద్ధం జరుగుతోంది.

Similar News

News March 19, 2025

సన్న వడ్లకు రూ.500 బోనస్‌‌పై UPDATE

image

TG: సన్న రకం వడ్లకు రూ.500 బోనస్‌పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. వానకాలం పంటకు సంబంధించి రూ.1200 కోట్ల నిధులకు ఆర్థిక శాఖ నిన్న ఆమోదం తెలిపిందని ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. సన్నరకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. డబ్బులు ఎప్పుడు జమ అవుతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు.

News March 19, 2025

IPLలో పర్పుల్ క్యాప్ హోల్డర్స్

image

*2008- సోహైల్ తన్వీర్ *2009- ఆర్పీ సింగ్
*2010- ప్రజ్ఞాన్ ఓఝా *2011- లసిత్ మలింగ
*2012- మోర్నే మోర్కెల్ *2013- డ్వేన్ బ్రావో
*2014- మోహిత్ శర్మ *2015- డ్వేన్ బ్రావో
*2016, 17- భువనేశ్వర్ కుమార్ *2018- ఆండ్రూ టై
*2019- ఇమ్రాన్ తాహిర్ *2020- కగిసో రబాడ
*2021- హర్షల్ పటేల్ *2022- యుజువేంద్ర చాహల్
*2023- మహమ్మద్ షమీ *2024- హర్షల్ పటేల్
*2025- ?

News March 19, 2025

అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే!

image

దాదాపు 9 నెలల తర్వాత ISS నుంచి భూమికి చేరిన సునీతా విలియమ్స్‌పై ప్రపంచం దృష్టి నెలకొంది. కాగా అంతరిక్షంలో ఒకే ప్రయాణంలో అత్యధిక రోజులు గడిపిన వ్యక్తుల్లో వాలేరి పోలికోవ్(రష్యా-437 డేస్) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఫ్రాంక్ రుబియో(US-371d), మార్క్ వాండె(355), స్కాట్ కెల్లీ(340) ఉన్నారు. సునీత, విల్మోర్ తలో 286 డేస్ అంతరిక్షంలో ఉన్నారు. కాగా సునీత తన మూడు ప్రయాణాల్లో 608 రోజులు రోదసిలో ఉన్నారు.

error: Content is protected !!