News July 3, 2024

121కి చేరిన మరణాలు.. భోలే బాబా పరార్

image

యూపీలోని హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరింది. నిన్న 116 మంది మరణించగా చికిత్స పొందుతూ ఈరోజు మరో ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉంటే అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసిన భోలే బాబా పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. బాబాకు సంబంధించిన రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్టులో వెతికినా ఆయన కనిపించలేదని తెలిపారు.

Similar News

News July 5, 2024

టీచర్ ట్రాన్స్‌ఫర్.. స్కూల్ మారిన 133 మంది స్టూడెంట్స్!

image

TG: ఉపాధ్యాయుడిపై ప్రేమ, గౌరవంతో 133 మంది విద్యార్థులు స్కూల్ మారారు. మంచిర్యాల జిల్లా జన్నారం(M) పోనకల్ ప్రభుత్వ స్కూల్ టీచర్ జె.శ్రీనివాస్ ఇటీవల అదే మండలంలోని అక్కపెల్లిగూడలోని స్కూలుకు బదిలీ అయ్యారు. తాము అభిమానించే, తమకు స్పెషల్ క్లాసులు చెప్పే గురువు కోసం విద్యార్థులు 3 కి.మీ దూరంలో ఉన్న ఆ పాఠశాలకు మారారు. దీనికి తల్లిదండ్రులు కూడా మద్దతు తెలిపారు.

News July 5, 2024

ప్రపంచ కప్ హీరోలకు మహారాష్ట్ర బొనాంజా

image

ప్రపంచ కప్ విజేతలు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, శివమ్ దూబేకు మహారాష్ట్ర సర్కార్ రూ.11 కోట్ల నజరానా ప్రకటించింది. అంతకుముందు మహారాష్ట్ర అసెంబ్లీలో వీరందరినీ సీఎం ఏక్‌నాథ్ షిండే శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం కెప్టెన్ రోహిత్ సభలో ప్రసంగించారు.

News July 5, 2024

MLCలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

image

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున రామచంద్రయ్య, జనసేన తరఫున హరిప్రసాద్ నామినేషన్ వేశారు. ఇతర పార్టీల నుంచి ఒక్క నామినేషన్ కూడా రాకపోవడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా వీరిద్దరి ఎన్నిక లాంఛనమైంది.