News November 15, 2024
నేడు బడ్జెట్పై చర్చ

AP: మొన్న ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ సందర్భంగా సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ సమాధానం ఇస్తారు. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ బిల్లు, ఏపీ ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెడతారు.
Similar News
News November 15, 2025
IIRSలో 11 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (<
News November 15, 2025
ఓడిపోయినా కేటీఆర్ బలుపు తగ్గలేదు: అద్దంకి

TG: జూబ్లీహిల్స్లో ఓడిపోయినా KTRకు బలుపు తగ్గలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. ‘నువ్వే అభ్యర్థి లాగా తిరిగావ్. మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టినా ఆమెతో కనీసం మాట్లాడనివ్వలేదు. మా అభ్యర్థికి 25వేల మెజారిటీ వస్తే బొటాబొటీతో గెలిచారు అంటున్నావ్. నీకు సిగ్గు లేదా. ఆత్మపరిశీలన చేసుకో. నీతోనే BRS పతనం అవ్వడం ఖాయం’ అని మీడియా సమావేశంలో మండిపడ్డారు.
News November 15, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* ఏ ఎన్నికలైనా బిహార్ లాంటి ఫలితాలే NDAకు వస్తాయి: బీజేపీ ఎంపీ పురందీశ్వరి
* లిక్కర్ కేసులో అరెస్టయిన అనిల్ చోఖ్రాకు విజయవాడ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది.
* సింగపూర్-విజయవాడల మధ్య నేరుగా విమాన సర్వీసులు ఇవాళ ప్రారంభమయ్యాయి.
* పరకామణి కేసులో సాక్షి అయిన టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ మరణంపై విచారణ కొనసాగుతోంది. గుంతకల్ రైల్వే స్టేషన్లో అతని బైక్ను పోలీసులు గుర్తించారు.


