News March 18, 2025
నేడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ

TG: ఇవాళ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరగనుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నట్లు సమాచారం. నిన్న ఈ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. దీంతో పాటు యాదాద్రి బోర్డు ఏర్పాటుపై బిల్లు, అడ్వకేట్ వెల్ఫేర్, అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్, మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Similar News
News November 18, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

*YCP హయాంలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు చూపించినా MLA పదవికి రాజీనామా చేస్తా: గంటా శ్రీనివాసరావు
*నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్, ఏ2 జగన్మోహన్ను ఈ నెల 19 నుంచి 22 వరకు కస్టడీకి అప్పగిస్తూ ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు.
*TTD పరకామణిలో చోరీ కేసు దొంగలే సతీశ్ కుమార్ను అంతమొందించారు. YS వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించినట్లే సతీశ్ హత్యను ఆత్మహత్యగా ప్రచారం చేస్తున్నారు: మంత్రి పార్థసారథి
News November 18, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

*YCP హయాంలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు చూపించినా MLA పదవికి రాజీనామా చేస్తా: గంటా శ్రీనివాసరావు
*నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్, ఏ2 జగన్మోహన్ను ఈ నెల 19 నుంచి 22 వరకు కస్టడీకి అప్పగిస్తూ ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు.
*TTD పరకామణిలో చోరీ కేసు దొంగలే సతీశ్ కుమార్ను అంతమొందించారు. YS వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించినట్లే సతీశ్ హత్యను ఆత్మహత్యగా ప్రచారం చేస్తున్నారు: మంత్రి పార్థసారథి
News November 18, 2025
దోషులు పాతాళంలో ఉన్నా వదలం: అమిత్ షా

ఢిల్లీ బ్లాస్ట్ దోషులు పాతాళంలో ఉన్నా వదలబోమని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వారిని చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని మూలాల నుంచి నిర్మూలించడం మనందరి బాధ్యతని అన్నారు. హరియాణాలోని ఫరీదాబాద్లో జరిగిన 32వ నార్తర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్కు ఆయన హాజరయ్యారు. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని సృష్టిస్తాయని, ఈ విషయంలో జోనల్ కౌన్సిల్స్ పాత్ర కీలకమని అన్నారు.


