News March 18, 2025
నేడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ

TG: ఇవాళ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరగనుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నట్లు సమాచారం. నిన్న ఈ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. దీంతో పాటు యాదాద్రి బోర్డు ఏర్పాటుపై బిల్లు, అడ్వకేట్ వెల్ఫేర్, అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్, మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Similar News
News April 17, 2025
IPL: వారి సరసన రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్లో ఒకే వేదికలో 100కు పైగా సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కోహ్లీ(130), గేల్(127), డివిలియర్స్(118) వందకు పైగా సిక్సర్లు బాదారు. వాంఖడేలో రోహిత్ 102 సిక్సర్లు కొట్టగా ఆ తర్వాతి స్థానంలో పొలార్డ్(85) ఉన్నారు.
News April 17, 2025
మే 8న ఏపీ క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మే 8న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. ఉ.11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మే 6 సాయంత్రంలోగా మంత్రివర్గ భేటీలో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. తల్లికి వందనం ఇతర పథకాల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
News April 17, 2025
BREAKING: డీఎస్సీకి వయోపరిమితి పెంపు

AP: రాష్ట్రంలో డీఎస్సీ-2025కి వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గరిష్ఠ వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. కటాఫ్ తేదీని 2024 జులై 1గా నిర్ధారించింది. ఈ డీఎస్సీకి మాత్రమే వయోపరిమితి పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.