News April 5, 2024
విశాఖను రాజధానిగా ప్రకటిస్తున్నా: కేఏ పాల్
AP: ఈ సారి వచ్చేది తమ ప్రభుత్వమేనని.. అందుకే రాష్ట్ర రాజధానిగా విశాఖను ముందే ప్రకటిస్తున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ‘రాయలసీమ ముఖ్యమంత్రులు వైజాగ్ను చిన్నచూపు చూశారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇక్కడి వనరులను దోచుకోవడానికి ప్రయత్నించారు. స్టీల్ ప్లాంట్ కోసం రూ.8 వేల కోట్లు ఇస్తా. అలా ఇవ్వకపోతే జైలు శిక్షకు కూడా నేను సిద్ధం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 25, 2025
సోనూసూద్ ఫౌండేషన్కు FCRA లైసెన్స్ మంజూరు
సోనూసూద్ ‘సూద్ చారిటీ ఫౌండేషన్’కు కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) లైసెన్సును మంజూరు చేసింది. ఈ లైసెన్సు పొందిన NGOలు ఐదేళ్ల పాటు విదేశీ నిధులను స్వీకరించవచ్చు, వాడుకోవచ్చు. సామాజిక సేవ చేయడం, అన్ని వర్గాల ప్రజలకు అత్యాధునిక వనరులు, సాయం అందాలనేదే తమ లక్ష్యమని సూద్ ఫౌండేషన్ పేర్కొంది. కొవిడ్ టైంలో సోనూసూద్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
News January 25, 2025
టీమ్ ఇండియాకు మరో షాక్? స్టార్ ఆల్రౌండర్కి గాయం?
ఓపెనర్ అభిషేక్ శర్మ కాలి గాయంతో బాధపడుతున్నట్లు వస్తున్న వార్తలు అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తుండగా తాజాగా మరో షాక్ తగిలింది. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో సిరీస్కు దూరమయ్యారు. రింకూ సింగ్ కూడా గాయపడటంతో నేటి, తర్వాతి మ్యాచులు ఆడటం లేదు. వారికి బ్యాకప్గా శివమ్ దూబే, రమణ్దీప్ సింగ్ను టీమ్ ఇండియా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
News January 25, 2025
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డా: రష్మిక
సినిమాల్లో సక్సెస్ అయ్యేందుకు కుటుంబానికి సమయం కేటాయించడంలో రాజీ పడినట్లు హీరోయిన్ రష్మిక చెప్పారు. వ్యక్తిగత, వృత్తిపర విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదన్నారు. కుటుంబమే తన బలమని, ముఖ్యమైన సమయాల్లో ఫ్యామిలీతోనే గడుపుతానని పేర్కొన్నారు. షూటింగ్స్ వల్ల తనకు ఇష్టమైన చెల్లిని మిస్ అవుతున్నానని పేర్కొన్నారు. కాగా, ఆమె నటించిన ‘ఛావా’ మూవీ FEB 14న రిలీజ్ కానుంది.