News January 29, 2025
మహా కుంభమేళాలో తీవ్ర విషాదం

మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో అర్ధరాత్రి <<15295646>>తొక్కిసలాట<<>> జరిగి పలువురు మహిళలు, చిన్నారులు గాయపడ్డారు. ఘటనాస్థలంలో భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. కొంతమంది మహిళల మృతదేహాలు ఆసుపత్రి ఫ్లోర్లో ఉన్నాయంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News November 11, 2025
జూబ్లీహిల్స్ పోలింగ్.. ప్రముఖులు ఓట్లు వేసేది ఎక్కడంటే?

TG: జూబ్లీ ఉపఎన్నికకు ఇవాళ పోలింగ్ జరగనుంది. షేక్పేట్లో డైరెక్టర్ SS రాజమౌళి, కమెడియన్ అలీ, మధురానగర్లో యాంకర్ సుమ సహా పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు ఓటు వేయనున్నారు. సినీ కార్మికుల ఓట్లు అధికంగా ఉండటంతో ఫిల్మ్ ఫెడరేషన్ షూటింగ్స్ రద్దు చేసి, వారికి సెలవు ఇచ్చింది. చిరంజీవి, చెర్రీ, బన్నీ నివాసాలు జూబ్లీ పరిధిలోనే ఉన్నా.. వారి నియోజకవర్గం మాత్రం ఖైరతాబాద్ కిందికి వస్తాయి. దీంతో వారు ఓటు వేయలేరు.
News November 11, 2025
ఆరుద్రలో అడ్డెడు చల్లినా పుట్టెడు పంట

ఆరుద్ర కార్తె (జూన్ 22 నుంచి జూలై 5 వరకు ఉండే సమయం) అనేది వర్షాకాలం ప్రారంభంలో వ్యవసాయ పనులకు సరైన సమయం. ఈ కార్తెలో భూమిలో తగినంత తేమ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అడ్డెడు( తక్కువ పరిమాణంలో) విత్తనాలు చల్లినా, అవి బాగా మొలకెత్తి పుట్టెడు(ఎక్కువ) పంటను ఇస్తాయని రైతుల విశ్వాసం. ఈ సామెత ఆరుద్ర కార్తెలో విత్తనాలు వేయడం, అప్పటి వర్షాలు.. పంటకు ఎంత అనుకూలంగా ఉంటాయో తెలియజేస్తుంది.
News November 11, 2025
హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి?

హనుమంతుని పూజతో భూతప్రేత పిశాచ భయాలు తొలగి, శని ప్రభావం వల్ల కలిగే బాధలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం వలన మంచి బుద్ధి, ధైర్యం, కీర్తి లభిస్తాయని నమ్మకం. ఆయనకు ఇష్టమైన అరటి, మామిడి పండ్లను నివేదించి, పూజించడం వల్ల చేపట్టిన కార్యాలు త్వరగా పూర్తై, మనసులోని కోరికలు నెరవేరుతాయట. ‘సంతానం కోసం ఎదురుచూసే దంపతులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం’ ఉత్తమం అని పండితులు చెబుతున్నారు.


