News March 24, 2024

సాక్షి పేపర్‌పై రూ.20కోట్ల పరువు నష్టం దావా

image

AP: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరి సాక్షి పేపర్‌పై రూ.20కోట్ల పరువునష్టం దావా వేశారు. సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌లో తాము భాగస్వాములమంటూ ప్రచురితమైన వార్తపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాల్లేకుండా వార్త ప్రచురించినందుకు సాక్షి న్యూస్ పేపర్ యాజమాన్యానికి పురందీశ్వరి లాయర్ నోటీసులు పంపించారు.

Similar News

News October 19, 2025

బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్

image

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారిద్దరూ ఇన్‌స్టా పోస్టు ద్వారా తెలియజేశారు. ‘చివరకు మా బేబీ బాయ్ వచ్చేశాడు. మా హృదయాలు నిండిపోయాయి. ఇప్పుడు మాకు అన్నీ ఉన్నాయి. కృతజ్ఞతలతో పరిణీతి, రాఘవ్’ అని రాసుకొచ్చారు. 2023 సెప్టెంబర్ 24న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

News October 19, 2025

APPLY NOW: CWCలో ఉద్యోగాలు

image

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌(CWC) 22 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cwceportal.com/

News October 19, 2025

మామిడిలో ఇనుపధాతు లోపం – నివారణ

image

మామిడిలో ఇనుపధాతులోప సమస్య ఉన్న చెట్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోతాయి. ఆకుల సైజు తగ్గిపోతుంది. సమస్య తీవ్రత పెరిగితే మొక్కల ఆకులు పైనుంచి కిందకు ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నేలల్లో సాధారణంగా కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా అన్నబేధి+1 గ్రా. నిమ్మఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు చెట్టుపై పిచికారీ చేయాలి.