News November 13, 2024
డిగ్రీ సిలబస్ మారబోతోంది!

TG: రాష్ట్రంలో డిగ్రీ సిలబస్ మారబోతోంది. 2019 నుంచి అవసరాలకు తగ్గట్లు కొత్త అంశాలు చేర్చలేదనే విమర్శలున్నాయి. దీంతో డిగ్రీ పాఠ్యాంశాలు మార్చేందుకు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఏటా సుమారు 2లక్షల మంది డిగ్రీలోని వివిధ కోర్సుల్లో చేరుతున్నారు. అటానమస్ కాలేజీలు సిలబస్లో మార్పులు చేసుకుంటుండగా, మిగతా వాటిల్లో అది జరగట్లేదు. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి తాజా నిర్ణయం తీసుకుంది.
Similar News
News July 8, 2025
‘డిగ్రీ’ వద్దంటా..!

TG: డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించట్లేదు. గత ఐదేళ్లుగా అడ్మిషన్లు క్రమంగా తగ్గుతూ రావడమే ఇందుకు నిదర్శనం. దోస్త్ మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ముగియగా ఈ విద్యా సంవత్సరంలో 4.36 లక్షల సీట్లకు 1.41 లక్షల విద్యార్థులే కాలేజీల్లో చేరారు. రాష్ట్రంలోని 957 డిగ్రీ కాలేజీల్లో 64 చోట్ల జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. అదే సమయంలో ఇంజినీరింగ్లో చేరే వారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.
News July 8, 2025
తమిళ రీమేక్ చేయనున్న నాగార్జున?

నాగార్జున ఓ రీమేక్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. శశికుమార్ నటించిన ‘అయోతి’ అనే తమిళ మూవీని నాగ్ రీమేక్ చేయనున్నట్లు టీటౌన్లో చర్చ జరుగుతోంది. ఈ మూవీ 2023లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి R.మంతిర మూర్తి దర్శకత్వం వహించారు. ఇందులో ఎమోషన్స్, కథ, కథనం గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారని, కమర్షియల్గానూ వర్కౌట్ అవుతుందని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
News July 8, 2025
UAE గోల్డెన్ వీసా.. వలసలు పెరుగుతాయా?

UAE <<16970784>>గోల్డెన్ వీసాతో<<>> భారతీయులు ఆ దేశంలో స్థిరపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రూ.4.66 కోట్ల పెట్టుబడి పెడితేనే ఈ వీసా వచ్చేది. ఇప్పుడు రూ.23 లక్షలు చెల్లిస్తే చాలు జీవితకాలం చెల్లుబాటయ్యే వీసా వస్తుంది. గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు తమ కుటుంబసభ్యులను అక్కడికి తీసుకెళ్లొచ్చు. వ్యాపారం, ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ దేశంలో తక్కువ పన్నులు, మెరుగైన మౌలిక వసతులు భారతీయులను ఆకర్షించొచ్చు.