News August 2, 2024

Delhi coaching center deaths : రూ.10 లక్షల చొప్పున పరిహారం

image

ఢిల్లీ వరదల్లో చనిపోయిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కుటుంబాలకు దృష్టి IAS పరిహారం ప్రకటించింది. ‘పిల్లల మరణంతో కలిగే బాధను ఎంత డబ్బిచ్చినా పోగొట్టలేం. ఆ 4 కుటుంబాలను ఆదుకొనేందుకే తలో రూ.10 లక్షలు అందిస్తున్నాం’ అని దృష్టి IAS డైరెక్టర్ దివ్య కీర్తి అన్నారు. రావూస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్లోకి వరద నీరు రావడంతో ముగ్గురు అభ్యర్థులు మరణించారు. మరొకరు హాస్టల్‌కు వెళ్తుండగా కరెంటు షాక్‌తో చనిపోయారు.

Similar News

News November 25, 2025

ఓయూ: ఆదివాసి బిడ్డకు ఓయూ డాక్టరేట్

image

ఆదివాసీ విద్యార్థి, ఉద్యమ నేత సాగబోయిన పాపారావుకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. సోషియాలజీ ప్రొ.పి విష్ణుదేవ్ పర్యవేక్షణలో ‘ఉప ప్రణాళిక, గిరిజన అభివృద్ధి రాష్ట్రంలోని ఐటీడీఏ భద్రాచలం సామాజిక శాస్త్ర అధ్యయనం’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గాను ఓయూ ఆయనకు డాక్టరేట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధ్యాపకులు అభినందించారు.

News November 25, 2025

శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం?

image

రష్యాతో పీస్ డీల్‌కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది’ అని అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, ఖరారు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అబుదాబిలో US, రష్యా బృందాలు చర్చలు జరుపుతున్నాయి.

News November 25, 2025

శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం?

image

రష్యాతో పీస్ డీల్‌కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది’ అని అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, ఖరారు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అబుదాబిలో US, రష్యా బృందాలు చర్చలు జరుపుతున్నాయి.