News August 2, 2024
Delhi coaching center deaths : రూ.10 లక్షల చొప్పున పరిహారం

ఢిల్లీ వరదల్లో చనిపోయిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కుటుంబాలకు దృష్టి IAS పరిహారం ప్రకటించింది. ‘పిల్లల మరణంతో కలిగే బాధను ఎంత డబ్బిచ్చినా పోగొట్టలేం. ఆ 4 కుటుంబాలను ఆదుకొనేందుకే తలో రూ.10 లక్షలు అందిస్తున్నాం’ అని దృష్టి IAS డైరెక్టర్ దివ్య కీర్తి అన్నారు. రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు రావడంతో ముగ్గురు అభ్యర్థులు మరణించారు. మరొకరు హాస్టల్కు వెళ్తుండగా కరెంటు షాక్తో చనిపోయారు.
Similar News
News October 19, 2025
పారిశ్రామికవేత్తలకు CM చంద్రబాబు శుభవార్త

AP: పారిశ్రామికవేత్తలకు CM చంద్రబాబు దీపావళి సందర్భంగా శుభవార్త చెప్పారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసి ఆయా సంస్థలకు చేయూత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా రూ.1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను తొలి విడతగా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
News October 19, 2025
భారీ జీతంతో NMDCలో ఉద్యోగాలు

NMDC లిమిటెడ్ 14 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, CGM, GM, డైరెక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకు OCT 21 ఆఖరు తేదీ కాగా.. డైరెక్టర్ పోస్టుకు OCT 27 లాస్ట్ డేట్. పోస్టును బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ (మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్), PG, PG డిప్లొమా, MBA, MSc, ఎంటెక్, MSc జియోలజీ, CA/ICMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
News October 19, 2025
దీపావళికి ఇంటిని ఇలా డెకరేట్ చేసుకోండి

దీపావళి అంటే వెలుగుల పండుగ. ఈ పండుగ రోజున మీ ఇల్లు దేదీప్యమానంగా మెరిసిపోయేందుకు LED లైట్లతో అలంకరించుకోవచ్చు. దీపాలను ఒక వరుసలో పెట్టడం కంటే దియా స్టాండ్లను వాడితే మంచి లుక్ వస్తుంది. గుమ్మానికి పూల తోరణాలతో పాటు హ్యాంగింగ్స్ వేలాడదీయాలి. ఇంటి ఆవరణలో చిన్నమొక్కలు ఉంటే వాటికి లైటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. పూలరంగోళీలు పండుగ శోభను మరింత పెంచుతాయి. పేపర్ లాంతర్లలో లైట్లను వేలాడదీస్తే ఇంకా బావుంటుంది.