News December 8, 2024
PM కిసాన్ రూ.12వేలకు పెంచాలని డిమాండ్

వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను ఒక శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. PM కిసాన్ వార్షిక సాయాన్ని ₹6K నుంచి ₹12Kకు పెంచాలని కోరారు. PM ఫసల్ బీమా యోజన కింద సన్నకారు రైతులకు జీరో ప్రీమియంతో ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రీబడ్జెట్ సంప్రదింపుల సమావేశంలో విన్నవించారు. పురుగుమందులపై GSTని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని PHD ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతిపాదించింది.
Similar News
News November 15, 2025
యూపీఐతో టోల్ చెల్లింపు.. ఛార్జీ భారీగా తగ్గింపు!

ఫాస్టాగ్ పనిచేయని, చెల్లుబాటు కాని వాహనదారులకు భారీ ఉపశమనం దక్కింది. ఫాస్టాగ్ లేకుంటే నేషనల్ హైవేలపై గతంలో టోల్ గేట్ల వద్ద రూ.100 చెల్లించాల్సి ఉంటే రూ.200 వరకు ఛార్జీ వసూలు చేసేవారు. అయితే నేటి నుంచి UPI ద్వారా పేమెంట్స్ చేస్తే రూ.100కు 25% అదనంగా అంటే రూ.125 చెల్లించి వెళ్లిపోవచ్చు. ఈ విధానం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే క్యాష్ ఇవ్వాలనుకుంటే రూ.100కు రూ.200 చెల్లించాల్సిందే.
News November 15, 2025
అల్పపీడనం.. ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు

ఈ నెల 19 నాటికి అండమాన్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఈ నెల 24-27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News November 15, 2025
శ్రీవారి గర్భగుడిలో ఏయే విగ్రహాలుంటాయంటే..?

తిరుమల ఆనంద నిలయంలో మూలవిరాట్ ప్రధానం కాగా అందుకు ప్రతిరూపమైన భోగ శ్రీనివాసమూర్తికి నిత్యాభిషేకాలు, రోజువారీ సేవలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, ఊరేగింపులలో పాల్గొనే శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు ఇతర సమయాల్లో గర్భాలయంలో కొలువై ఉంటారు. అలాగే కొలువు, ఉగ్ర శ్రీనివాసమూర్తులను కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ 5 విగ్రహాలను కలిపి ‘పంచబేరాలు’ అంటారు.
☞ మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


