News August 31, 2024
ముందస్తు నోటీసులు లేకుండా కూల్చడం బాధాకరం: పల్లం రాజు

TG: తన సోదరుడు ఆనంద్కు చెందిన స్పోర్ట్స్ విలేజ్ను అక్రమంగా కూల్చివేశారని కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అనుమతులతో 7 ఎకరాలు లీజుకు తీసుకొని OROను ఏర్పాటు చేశామన్నారు. 2015 నుంచే ఇది నిర్వహణలో ఉందని, ఎలాంటి నోటీసులు లేకుండా హైడ్రా కూల్చివేయడం బాధించిందని Xలో రాసుకొచ్చారు. ప్రజా జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా పనిచేసిన తమపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమన్నారు.
Similar News
News February 15, 2025
22 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న 48ఏళ్ల నటుడు

బాలీవుడ్ నటుడు, యూట్యూబర్ సాహిల్ ఖాన్ 48 ఏళ్ల వయసులో వాలంటైన్స్ డే సందర్భంగా తన ప్రియురాలైన 22 ఏళ్ల మిలేనా అలెగ్జాండ్రాను వివాహమాడారు. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాలో వీరిద్దరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. సాహిల్ గతంలో నార్వేజియన్ నటి నెగర్ ఖాన్ను వివాహం చేసుకోగా రెండేళ్లకే విడిపోయారు.
News February 15, 2025
టీడీపీ నేతలను వేధించినవారిపై రెడ్బుక్ అమలు: లోకేశ్

AP: వైసీపీ హయాంలో జరిగిన అరాచకపాలన ప్రజలందరికీ తెలుసని మంత్రి లోకేశ్ చెప్పారు. చట్టాలను ఉల్లంఘించి టీడీపీ నేతలను ఇబ్బందిపెట్టిన వారిపై రెడ్ బుక్ అమలవుతుందని స్పష్టం చేశారు. తప్పుచేసిన వైసీపీ నేతలు, అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని యువగళంలోనే చెప్పానన్నారు. ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వల్లభనేని వంశీ జైలుకెళ్లారని, ఈ కేసులో వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.
News February 15, 2025
సోమనాథ్ క్షేత్రం ప్రత్యేకతలు మీకు తెలుసా… !

ద్వాదశ జ్యోతిర్లింగాలలో గుజరాత్లో ఉండే సోమనాథ్ క్షేత్రం మెుదటిది. చంద్రునికి శాపవిముక్తి కలిగించిన ప్రదేశం కాబట్టి దీనికి సోమనాథ క్షేత్రంగా పేరొచ్చిందని ప్రతీతి. చంద్రుడు ఈక్షేత్రాన్ని బంగారంతో నిర్మించగా, రావణాసురుడు వెండితో, శ్రీ కృష్ణుడు చందనపు చెక్కలతో నిర్మించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. గజనీ మహమ్మద్ సహా అనేక మంది దాడి చేసి సంపద దోచుకెళ్లగా 1951లో పునర్నిర్మించి ప్రారంభించారు.