News May 11, 2024
సముద్ర ఉష్ణోగ్రతలతో డెంగీ వ్యాప్తిని అంచనా వేయవచ్చు: శాస్త్రవేత్తలు

హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను బట్టి డెంగీ విజృంభణను ముందే అంచనా వేయవచ్చని ఓ పరిశోధనలో తేలింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగితే దోమల సంఖ్య పెరిగి, డెంగీ వ్యాప్తిపై ప్రభావం పడుతుందని చైనాలోని నార్మల్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. 1990 నుంచి పలు దేశాల్లో నమోదైన కేసులను వారు పరిశీలించారు. సముద్ర ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలకు, డెంగీ విజృంభణకు మధ్య చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు గుర్తించారు.
Similar News
News November 9, 2025
BIGG BOSS: ఈ వారం డబుల్ ఎలిమినేషన్!

బిగ్బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. రాము రాథోడ్ నిన్న సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. ఫ్యామిలీని మిస్ అవుతున్నానని చెప్పి హౌజ్ నుంచి నిష్క్రమించారు. మరోవైపు అతి తక్కువ ఓట్లు రావడంతో ‘గోల్కొండ హైస్కూల్’ మూవీ ఫేమ్ శ్రీనివాస సాయిని బయటికి పంపినట్లు సమాచారం. ప్రస్తుతం హౌజ్లో 11 మంది మిగిలారు. మరో 6 వారాల్లో షో ముగియనుండగా టాప్-5కి వెళ్లేదెవరనే ఆసక్తి నెలకొంది.
News November 9, 2025
RITES 40పోస్టులకు నోటిఫికేషన్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(<
News November 9, 2025
కాంగ్రెస్, BRS నేతలను నిలదీయండి: కిషన్ రెడ్డి

TG: కేసీఆర్ తరహాలోనే రేవంత్ కూడా మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క అమ్మాయికీ పెళ్లి సమయంలో తులం బంగారం ఇవ్వలేదని విమర్శించారు. ‘పెన్షన్లు పెంచలేదు, కొత్తవి ఇవ్వలేదు. దళితులకు ఆర్థిక సాయం చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఎటు పోయాయని కాంగ్రెస్ నేతలను నిలదీయండి. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకివ్వలేదని బీఆర్ఎస్ను ప్రశ్నించండి’ అని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు.


