News June 15, 2024
ఈ నెల 18న పీఎం కిసాన్ నిధుల జమ

పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత నిధులు ఈ నెల 18వ తేదీన విడుదల కానున్నాయి. రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వారణాసి పర్యటనలో PM మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ తొలి సంతకం ఈ నిధుల విడుదల దస్త్రంపైనే పెట్టారు. ఈ స్కీమ్ కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో రూ.2వేలు) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది.
Similar News
News February 8, 2026
రేపు జానకీ జయంతి.. ఇలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం

శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జయంతి రేపు. దీనినే జానకీ జయంతి/సీతా అష్టమి అంటారు. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, తలస్నానం చేయాలి. పీటపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచి సీతారాముల ఫొటో పెట్టి పూలతో అలంకరించాలి. ఎర్ర చీర, పూలు, గాజులు, సింధూరం సమర్పించి పూజించాలి. సీతారాముల అష్టోత్తరం చదవాలి. 5/9 మంది సుమంగళులకు పసుపు కుంకుమ, గాజులు, పూలు ఇచ్చి భోజనం పెట్టాలని పండితులు చెబుతున్నారు.
News February 8, 2026
SPMCILలో ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.50వేలు

సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<
News February 8, 2026
తన పురుషాంగం, తల దాచాలని కోరాడు

సెక్స్ ట్రాఫికర్ ఎప్స్టీన్ గురించి పలు విచిత్ర విషయాలూ బయటకొస్తున్నాయి. అందులో ఒకటి.. Cryonics. పిలిచే నిరూపితం కాని ఈ సైన్స్ ప్రక్రియలో మృతదేహాన్ని -195° నుంచి -320° మధ్య ఫ్రీజ్ చేస్తారు. ఆ వ్యక్తికి గల రోగం/సమస్యకు ఫ్యూచర్లో సరైన పరిష్కారం దొరికినప్పుడు తిరిగి యాక్టివ్ చేసి చికిత్స చేస్తారు. దీన్ని బాగా నమ్మిన ఎప్స్టీన్ తన తల, పురుషాంగం ఫ్రీజ్ చేయాలని సైంటిస్టులకు సూచించాడట.


