News June 15, 2024

ఈ నెల 18న పీఎం కిసాన్ నిధుల జమ

image

పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత నిధులు ఈ నెల 18వ తేదీన విడుదల కానున్నాయి. రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వారణాసి పర్యటనలో PM మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ తొలి సంతకం ఈ నిధుల విడుదల దస్త్రంపైనే పెట్టారు. ఈ స్కీమ్ కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో రూ.2వేలు) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది.

Similar News

News February 9, 2026

ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడితో మోదీ

image

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పని చేసిన సైనికుడు జయరాజ్ రాజారావును PM మోదీ కలిశారు. మలేషియాలో పర్యటనలో ఉన్న ఆయన కౌలాలంపూర్‌లో ఈ మేరకు భేటీ అయ్యారు. ‘రాజారావు జీవితం అపార ధైర్యం, త్యాగాలతో నిండింది. ఆయన అనుభవాలను వినడం స్ఫూర్తి కలిగించింది. భారతదేశ భవితవ్యాన్ని రూపొందించడంలో సాయపడిన INA సైనికులు, నేతాజీకి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అని మోదీ పేర్కొన్నారు.

News February 9, 2026

చంద్రుడిపై సిటీ నిర్మాణం.. పదేళ్లలోనే పూర్తి: మస్క్

image

చంద్రుడిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మించడంపై SpaceX దృష్టిసారించిందని, ఇది 10ఏళ్లలోనే పూర్తవుతుందని ఎలాన్ మస్క్ తెలిపారు. అంగారకుడిపై దీనికి 20+Y పడుతుందన్నారు. ‘గ్రహాలు 26 నెలలకొసారి సమాంతరంగా చేరినప్పుడే 6 నెలల్లో మార్స్‌కు ప్రయాణించగలం. 10 రోజులకోసారి 2 రోజుల్లో చంద్రుడిపైకి వెళ్లొచ్చు కాబట్టి అక్కడ సిటీని వేగంగా పూర్తిచేయగలం. భవిష్యత్తు నాగరికతను కాపాడటమే మా లక్ష్యం’ అని Xలో పేర్కొన్నారు.

News February 9, 2026

గొర్రెల మందలో విత్తన పొట్టేలు ప్రాముఖ్యత

image

గొర్రెల మంద పెరగాలన్నా, నాణ్యమైన పిల్ల రావాలన్నా, మందలో ప్రతీ 20-25 గొర్రెలకు మంచి విత్తన పొట్టేలును ఎంపిక చేసుకోవాలి. అది బలంగా, ఎత్తుగా ఉండాలి. చాలా మంది రైతులు తమ మందలో పుట్టిన పిల్లను విత్తనం కోసం ఎంపిక చేసుకుంటారు. దీని వల్ల నాణ్యమైన పిల్ల పుట్టకపోగా, బలహీనంగా, అంగవైకల్యంతో, తక్కువ బరువు, సంతానోత్పత్తికి పనికిరాకుండా ఉంటాయి. అందుకే వేరే మంద నుంచి నాణ్యమైన పొట్టేలును ఎంపిక చేసుకోవడం ఉత్తమం.