News June 15, 2024
ఈ నెల 18న పీఎం కిసాన్ నిధుల జమ

పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత నిధులు ఈ నెల 18వ తేదీన విడుదల కానున్నాయి. రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వారణాసి పర్యటనలో PM మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ తొలి సంతకం ఈ నిధుల విడుదల దస్త్రంపైనే పెట్టారు. ఈ స్కీమ్ కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో రూ.2వేలు) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది.
Similar News
News January 1, 2026
మార్చి నుంచి గూగుల్ డేటా సెంటర్ పనులు

AP: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పనులు మార్చి నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. గూగుల్కు జనవరి 10వ తేదీ కల్లా తర్లువాడలో 308 ఎకరాలను అప్పగిస్తామని చెప్పారు. జనవరి మూడో వారంలో టీసీఎస్ క్యాంపస్ ప్రారంభం అవుతుందని వివరించారు. అడవివరంలో సింహాచలం దేవస్థానం భూముల కేటాయింపు ఫైలు ప్రభుత్వం వద్ద ఉందని వెల్లడించారు.
News January 1, 2026
ధనుర్మాసం: పదిహేడో రోజు కీర్తన

ద్వారపాలకుల అనుమతితో లోపలికి వెళ్లిన గోపికలు మొదట నందగోపుడిని, ఆపై యశోదమ్మను ‘మేలుకో’ అని వేడుకున్నారు. లోకాలను కొలిచిన త్రివిక్రమ స్వరూపుడైన కృష్ణుడిని నిద్రలేవమని ప్రార్థించారు. ఆపై బలరాముడిని నిద్రలేపడం మరచినందుకు చింతిస్తూ ‘బంగారు కడియాలు ధరించిన బలరామా! నీవు, నీ తమ్ముడు కృష్ణుడు వెంటనే మేల్కొనండి’ అని వేడుకున్నారు. ఇలా వరుసగా అందరినీ ప్రార్థిస్తూ, వారి కృప కోసం వేచి చూస్తున్నారు. <<-se>>#DHANURMASAM<<>>
News January 1, 2026
యుద్ధంలో గెలిచేది మేమే: పుతిన్

ఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధంలో గెలిచేది తామేనని దేశం భావిస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఉక్రెయిన్తో పోరాడుతున్న హీరోలను(సైనికులు) సపోర్ట్ ప్రజలను చేయాలని కోరారు. ‘మేం మీపై, మన విజయంపై నమ్మకం ఉంచుతున్నాం’ అని సోల్జర్లను ఉద్దేశించి న్యూఇయర్ ప్రసంగంలో అన్నారు. తన నివాసంపై ఉక్రెయిన్ <<18728652>>డ్రోన్ దాడి<<>> గురించి ఆయన ప్రస్తావించలేదు. పుతిన్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 31తో 26 ఏళ్లు పూర్తయ్యాయి.


