News June 15, 2024
ఈ నెల 18న పీఎం కిసాన్ నిధుల జమ

పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత నిధులు ఈ నెల 18వ తేదీన విడుదల కానున్నాయి. రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వారణాసి పర్యటనలో PM మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ తొలి సంతకం ఈ నిధుల విడుదల దస్త్రంపైనే పెట్టారు. ఈ స్కీమ్ కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో రూ.2వేలు) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది.
Similar News
News February 10, 2026
BREAKING: టెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ టెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్ను పాఠశాల విద్యాశాఖ అధికారిక <
News February 10, 2026
నెక్ట్స్ సినిమాపై గాసిప్స్.. అనిల్ రావిపూడి ఫన్నీ రియాక్షన్

‘మన శంకరవరప్రసాద్ గారు’ హిట్తో అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై Xలో అనిల్ ఫన్నీగా స్పందించారు. ‘నేను ఇంకా పేపర్పై పెన్ కూడా పెట్టలేదు. అప్పుడే నటీనటులు, కథ, టైటిల్ పెట్టేశారు. ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్, కట్ కూడా చెప్పేస్తారేమో! మీ ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను. నా తర్వాతి సినిమా ఏంటి, ఎవరితో అనేది అతిత్వరలోనే చెబుతా’ అని తెలిపారు.
News February 10, 2026
శ్రీలంక జట్టుకు కీలక ప్లేయర్ దూరం

T20 WC జరుగుతున్న వేళ శ్రీలంక జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. అతని ఎడమ కాలి కండరాల్లో చీలిక ఏర్పడినట్లు MRI స్కానింగ్లో తేలడంతో జట్టు నుంచి తప్పించారు. హసరంగ స్థానంలో లెగ్ స్పిన్ ఆల్రౌండర్ దుషాన్ హేమంతకు జట్టులో చోటు కల్పించారు. 8వ తేదీ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక గెలుపొందిన విషయం తెలిసిందే.


