News June 15, 2024

ఈ నెల 18న పీఎం కిసాన్ నిధుల జమ

image

పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత నిధులు ఈ నెల 18వ తేదీన విడుదల కానున్నాయి. రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వారణాసి పర్యటనలో PM మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ తొలి సంతకం ఈ నిధుల విడుదల దస్త్రంపైనే పెట్టారు. ఈ స్కీమ్ కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో రూ.2వేలు) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది.

Similar News

News February 11, 2026

ఏప్రిల్ నుంచి విశాఖ మెట్రో రైలు భూసేకరణ?

image

AP: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ భూసేకరణ ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మెట్రో మార్గంలో నష్టపోయే నివాస, వ్యాపార ఆస్తులను గుర్తించే సర్వే దాదాపుగా పూర్తయింది. ఈ రూట్‌కు 99.2 ఎకరాల భూమి అవసరం కాగా ఎక్కువభాగం ప్రభుత్వానికి(87 ఎకరాలు) చెందినదే ఉంది. రోడ్డుకు అనుసంధానంగా మెట్రో వెళ్లేలా DPR రూపొందించగా ఢిల్లీ, హైదరాబాద్ తరహా నిర్మాణ విధానం అనుసరించనున్నారు.

News February 11, 2026

‘మైసూర్ సోప్’ అంబాసిడర్‌గా తమన్నానే ఎందుకు?

image

తమన్నాను మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై కర్ణాటకలో <<19102536>>దుమారం<<>> రేగిన విషయం తెలిసిందే. అయితే నార్త్, సౌత్‌లో పాపులర్ ఫ్యాక్టర్, ప్రస్తుతం ఆమె ఎలాంటి బ్యూటీ సబ్బులను ప్రమోట్ చేయకపోవడం, SM ఫాలోవర్లు, పాన్ ఇండియా అప్పియరెన్స్, స్క్రీన్ ప్రెసెన్స్ అంశాలు కారణాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ చెబుతోంది. దీపిక, రష్మిక, కియారా, పూజా హెగ్డేను వెనక్కి నెట్టి తమన్నా ఈ ఆఫర్ కొట్టేశారు.

News February 11, 2026

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఎంతంటే?

image

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఓవరాల్‌గా 73.01శాతం పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్లలో 66.05శాతం, మున్సిపాలిటీల్లో 75.88శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగిసినా క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించి తాజాగా పూర్తి డేటాను వెల్లడించారు. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.