News June 15, 2024

ఈ నెల 18న పీఎం కిసాన్ నిధుల జమ

image

పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత నిధులు ఈ నెల 18వ తేదీన విడుదల కానున్నాయి. రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వారణాసి పర్యటనలో PM మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ తొలి సంతకం ఈ నిధుల విడుదల దస్త్రంపైనే పెట్టారు. ఈ స్కీమ్ కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో రూ.2వేలు) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది.

Similar News

News February 12, 2026

ACTRECలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

టాటా మెమోరియల్ సెంటర్ -అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్& ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్(ACTREC) 25 మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 4వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో DM/DNB, MD, MSc/మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్/MBBS/BDS/BAMS/BHMS/ఫార్మా డీ, BSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://actrec.gov.in

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘చంద్రశేఖర’’

image

దక్షుడి శాపం వల్ల చంద్రుడి కళలు క్షీణించి, ఉనికినే కోల్పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు చంద్రుడు శివుడిని శరణు వేడగా ఆయన కరుణించాడు. చంద్రుడిని తన తలపై నెలవంకగా ధరించాడు. అలా చంద్రుడికి పునర్జన్మనిచ్చి లోకానికి వెలుగు ప్రసాదించాడు. తనను ఆశ్రయించిన వారికి మృత్యు భయం ఉండదని చెప్పడానికి ఇదొక నిదర్శనం. చంద్రుడిని శిఖరంపై(తలపై) అలంకారంగా ధరించిన వాడు కాబట్టి ఆయనను ‘చంద్రశేఖరుడు’గా కీర్తిస్తున్నాం.

News February 12, 2026

ఎండు మేతతో పొట్టేళ్లకు లాభం

image

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.