News March 17, 2024
చిలకలూరిపేట సభకు మోదీ పర్యటన వివరాలు

మండలంలోని బొప్పూడి వద్ద నేడు జరగనున్న టీడీపీ కూటమి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సభకు ప్రధానమంత్రి మోదీ హాజరవుతారు. ఆదివారం సాయంత్రం 4. 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 5 నుంచి 6 గంటల వరకు ప్రసంగిస్తారు. 6.10 గంటలకు తిరుగుపయనమవుతారు. 6.55 గంటలకు గన్నవరం చేరుకొని, 7:00 గంటలకు హైదరాబాద్ వెళతారు.
Similar News
News April 1, 2026
GNT: ఈ ప్రాంతాల్లోనే పెరిగిన వార్డుల సంఖ్య

@తెనాలి ప్రస్తుతం 40 వార్డులు ఉండగా 52కు పెరిగాయి
@రేపల్లె ప్రస్తుతం 28 వార్డులు ఉండగా -36కు పెరిగాయి
@మాచర్ల ప్రస్తుతం 31 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@సత్తెనపల్లి ప్రస్తుతం 31 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@వినుకొండ ప్రస్తుతం 32 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@గురజాల ప్రస్తుతం 20 వార్డులు ఉండగా 23కు పెరిగాయి
News April 1, 2026
ఉమ్మడి గుంటూరుకు వైద్యుల నియామక ఉత్తర్వులు

రాష్ట్రవ్యాప్తంగా 482 మంది వైద్యులకు నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జిల్లాల వారీగా పంపిణీలో పల్నాడు జిల్లాకు 26 మంది, గుంటూరు జిల్లాకు 14 మంది వైద్యులను కేటాయించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో సేవలందించేందుకు వీరిని నియమించగా, 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని సూచించారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా పోస్టింగులు ఇచ్చినట్లు వెల్లడించారు.
News April 1, 2026
ఉమ్మడి గుంటూరుకు వైద్యుల నియామక ఉత్తర్వులు

రాష్ట్రవ్యాప్తంగా 482 మంది వైద్యులకు నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జిల్లాల వారీగా పంపిణీలో పల్నాడు జిల్లాకు 26 మంది, గుంటూరు జిల్లాకు 14 మంది వైద్యులను కేటాయించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో సేవలందించేందుకు వీరిని నియమించగా, 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని సూచించారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా పోస్టింగులు ఇచ్చినట్లు వెల్లడించారు.


