News June 20, 2024

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు

image

వేసవి సెలవులు ముగిసి వర్షాకాలం వచ్చేసినా తిరుమలలో రద్దీ మాత్రం సెలవుల స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 79,584మంది దర్శించుకున్నారు. వారిలో 31,848మంది తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.4.18 కోట్లు సమకూరింది.

Similar News

News January 8, 2026

Ashes: ఆసీస్ టార్గెట్ 160 రన్స్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ చివరి టెస్టులో ఆసీస్ విజయానికి 160 రన్స్ అవసరం. రెండో ఇన్నింగ్స్‌లో ENG 342 పరుగులకు ఆలౌట్ అయింది. బెథెల్(154) మినహా ఎవరూ రాణించలేదు. AUS బౌలర్లలో స్టార్క్, వెబ్‌స్టర్ చెరో 3, బోలాండ్ 2, నెసెర్ ఒక వికెట్ తీశారు. మ్యాచ్ ఇవాళ చివరి రోజు కాగా మొత్తం 5 టెస్టుల సిరీస్‌లో AUS ఇప్పటికే మూడింట్లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకుంది. ENG ఒక మ్యాచులో గెలిచింది.

News January 8, 2026

బలపడిన వాయుగుండం.. తుఫానుగా మారే ఛాన్స్!

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుందని IMD తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. తర్వాత ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే ఛాన్స్ కూడా ఉంది. దీంతో అధికారులు వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టులకు ఒకటో నంబర్ తుఫాను హెచ్చరిక జారీ చేశారు.

News January 8, 2026

ప్రధాని మోదీ ఆస్తులు ఎంతంటే?

image

PM నరేంద్ర మోదీ ఆస్తుల విలువ రూ.3.02 కోట్లకు చేరిందని ఏడీఆర్ (Association for Democratic Reforms) నివేదిక వెల్లడించింది. 2014తో పోలిస్తే పదేళ్లలో ఆయన ఆస్తులు 82% పెరిగాయి. ఇక లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు 2014లో రూ.9.4 కోట్లుగా ఉండగా, 2024 నాటికి రూ.20.39 కోట్లకు చేరి 117% వృద్ధి నమోదైంది. వరుసగా 3 సార్లు గెలిచిన ఎంపీల సగటు ఆస్తులు కూడా పదేళ్లలో 110% పెరిగినట్లు ADR తెలిపింది.