News June 20, 2024
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు

వేసవి సెలవులు ముగిసి వర్షాకాలం వచ్చేసినా తిరుమలలో రద్దీ మాత్రం సెలవుల స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 79,584మంది దర్శించుకున్నారు. వారిలో 31,848మంది తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.4.18 కోట్లు సమకూరింది.
Similar News
News January 12, 2026
శాంసంగ్కు చెక్.. టాప్ స్మార్ట్ఫోన్ బ్రాండ్గా యాపిల్

స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో యాపిల్ కంపెనీ నంబర్ వన్గా నిలిచింది. ఐఫోన్ 17 సక్సెస్, 16కు భారీ డిమాండ్, సేల్స్లో 10 శాతం గ్రోత్ సాధించడంతో గత 14 ఏళ్లలో తొలిసారిగా టాప్లోకి వచ్చింది. శాంసంగ్ రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ మార్కెట్లో యాపిల్ 20%, శాంసంగ్ 19%, షియోమీ 13%, వివో 8%, ఒప్పో 8%, ఇతర బ్రాండ్లు 32% వాటా కలిగి ఉన్నాయి.
News January 12, 2026
చర్చలకైనా, యుద్ధానికైనా మేం రెడీ: ఇరాన్

దాడి చేస్తామని ట్రంప్ <<18832950>>హెచ్చరిస్తున్న<<>> నేపథ్యంలో చర్చలకైనా, యుద్ధానికైనా తాము సిద్ధమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. దేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు. హింసకు మొస్సాద్ కారణమని ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వ అనుకూల ర్యాలీల కోసం వేలమందిని రంగంలోకి దించినట్లు అంతర్జాతీయ మీడియా చెప్పింది. టెహ్రాన్తోపాటు ఇతర ప్రధాన సిటీల్లోనూ ప్రదర్శనలు చేస్తున్నట్లు తెలిపింది.
News January 12, 2026
ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక

AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆర్థికశాఖ రూ.2,653 కోట్ల డీఏ, డీఆర్ ఎరియర్స్, కాంట్రాక్టర్ల బిల్లులకు నిధులు విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న డీఏ, డీఆర్ ఎరియర్స్ కోసం రూ.1,110 కోట్లు, పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవులకు రూ.110 కోట్లు, ఈఏపీ, నాబార్డ్, సాస్కీ, CRIF పనులకు రూ.1,243 కోట్లు, నీరు-చెట్టు బిల్లులకు రూ.40 కోట్లు రిలీజ్ చేసింది. మొత్తంగా 5.7 లక్షల మందికి బిల్లులు, బకాయిలు చెల్లించింది.


