News March 10, 2025
నేటి నుంచి ధర్మపురి నృసింహుని బ్రహ్మోత్సవాలు

TG: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఈనెల 22 వరకు జరగనున్నాయి. నేడు పుట్ట బంగారంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. రేపు సాయంత్రం స్వామివారి కళ్యాణ వేడుకలు జరగనున్నాయి. 14, 15, 16 తేదీల్లో తెప్పోత్సవం, డోలోత్సవం, 16, 17, 18 తేదీల్లో స్వామివార్ల దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర కార్యక్రమాలు చేపడతారు. 19న రథోత్సవం, 20, 21, 22 తేదీల్లో ఉత్సవమూర్తుల ఏకాంతోత్సవాలను జరిపిస్తారు.
Similar News
News March 10, 2025
భారత్ బ్రహ్మాస్త్రం: గంటలో USను చేరగల వేగం!

భారత్ అద్భుతం చేసింది. 1500KM రేంజుతో గంటకు 12,144 KMPH వేగంతో దూసుకెళ్లే ఆధునిక బ్రహ్మాస్త్రాన్ని రూపొందించింది. అంటే ఢిల్లీ నుంచి వాషింగ్టన్కు గంటలో చేరగల వేగమిది. ఈ లాంగ్రేంజ్ యాంటీషిప్ మిసైల్ (LRAShM)ను 2023, NOV 16న విజయవంతంగా పరీక్షించిన DRDO తాజాగా మరోసారి సత్తా చూపింది. ఇది ధ్వని కన్నా 10రెట్లు అంటే సెకనుకు 3.37KM, ముంబై నుంచి కరాచీకి 5ని.ల్లో వెళ్లగలదు. చైనా, US కన్నా ఇదే బెస్ట్.
News March 10, 2025
ప్రణయ్ హత్య కేసు నిందితులు వీరే

A1 మారుతీరావు (అమృత తండ్రి), A2 సుభాష్ శర్మ(బిహార్), A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ భారీ, A5 అబ్దుల్ కరీం, A6 శ్రావణ్ (మారుతీరావు తమ్ముడు), A7 శివ (మారుతీరావు కారు డ్రైవర్), A8 నిజాం (ఆటో డ్రైవర్). కరీం సాయంతో అస్గర్కు సుపారీ ఇచ్చిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో <<15710208>>ప్రణయ్ను<<>> హత్య చేయించాడు.
News March 10, 2025
ప్రణయ్ హత్య కేసు: ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు

TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ఏ2గా ఉన్న సుభాష్కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీ రావు 2020లో ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో మిర్యాలగూడలో అమృతతో కలిసి వెళ్తోన్న ప్రణయ్ను సుభాష్ శర్మ కత్తితో నరికి చంపాడు.