News April 1, 2024

ధోనీ ధనాధన్.. పదేళ్ల క్రితం ట్వీట్ వైరల్

image

నిన్నటి ఢిల్లీ, చెన్నై మ్యాచ్‌లో ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. CSK ఓడినా మునపటి ధోనీని చూశాం, అది చాలు అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ పదేళ్ల క్రితం చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ఏ జట్టు గెలుస్తుందనేది అనవసరం, నేను ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడానికే ఉన్నా’ అని 2014, మార్చి 24న ట్వీట్ చేశారు. అన్నట్టుగానే ధోనీ ఎంటర్‌టైన్ చేశారంటూ ఫ్యాన్స్ ఆ పాత పోస్ట్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

Similar News

News April 2, 2026

పోలవరంలో కీలక ఘట్టం పూర్తి: చంద్రబాబు

image

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 1,372 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో డీ-వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.వెయ్యి కోట్లు వెచ్చించి నిర్మించామన్నారు. దీంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ECRF) డ్యామ్ పనులు వేగవంతం అవుతాయని వెల్లడించారు. 2027 పుష్కరాలకు ముందే పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

News April 2, 2026

పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

image

ఇరాన్ యుద్ధాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని పొరుగు దేశం(పాకిస్థాన్) కవ్విస్తే అంతకు రెట్టింపు సమాధానం చెబుతామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ వార్నింగ్ ఇచ్చారు. కేరళలో సైనిక్ సమ్మేళన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. Op సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు.

News April 2, 2026

హార్ముజ్‌లో ఇండియన్స్ సేఫ్: ఇరాన్

image

హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతపై ఇరాన్ భరోసా ఇచ్చింది. ‘మా ఇండియన్ ఫ్రెండ్స్ సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నారు’ అని భారత్‌లోని ఇరాన్ ఎంబసీ ప్రకటించింది. ఇండియాకు రావాల్సిన 19 చమురు నౌకలతో పాటు వేలాది మంది భారత సిబ్బంది యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం జరిపిన దౌత్య చర్చల ఫలితంగా ఇప్పటికే కొన్ని నౌకలు సేఫ్‌గా స్వదేశానికి చేరుకున్నాయి.