News November 18, 2024
ధోనీ కెప్టెన్సీలో ఆడారు.. మెంటార్లు అయ్యారు..!

భారత క్రికెట్ దిగ్గజం MS ధోనీ IPL 18వ సీజన్లో ఆడబోతున్నారు. కాగా కొందరు ధోనీ కెప్టెన్సీలో ఆడి రిటైర్మెంట్ పలికి తిరిగి మెంటార్లుగా IPLలో అడుగుపెడుతున్నారు. ఈ లిస్టులో ద్రవిడ్, పార్థివ్ పటేల్, జహీర్ ఖాన్, దినేశ్ కార్తీక్, బ్రావో ఉన్నారు. వీరంతా వివిధ జట్లకు కోచ్, మెంటార్లుగా నియమితులయ్యారు. ధోనీ మాత్రం ఇంకా IPLలో ఆటగాడిగా కొనసాగుతున్నారు. దీంతో అభిమానులు దటీజ్ తల అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Similar News
News July 7, 2025
గిల్ సేనపై లెజెండ్స్ ప్రశంసల వర్షం

ఎడ్జ్బాస్టన్లో గిల్ సేన వీరోచితంగా పోరాడింది. డ్రా అవుతుందనుకున్న మ్యాచ్ని విజయంగా మలిచారు. టీమ్ ఆల్రౌండ్ ప్రదర్శనను క్రికెట్ అభిమానులే కాదు.. లెజెండ్స్ సైతం ప్రశంసిస్తున్నారు. యంగ్ టీమ్ ఇండియా అటాక్.. ఇంగ్లండ్ కంటే గొప్పగా ఉందని గంగూలీ, సెహ్వాగ్, యువరాజ్, కోహ్లీ కొనియాడారు. కెప్టెన్ గిల్, ఓపెనర్స్, బౌలర్స్ ఆకాశ్ దీప్, సిరాజ్ ఇలా అంతా కలిసి గొప్ప విజయాన్ని అందుకున్నారని పేర్కొన్నారు.
News July 7, 2025
రెబలోడి దెబ్బ మర్చిపోయారా?: ప్రభాస్ ఫ్యాన్స్

డిసెంబర్ 5న ప్రభాస్ ‘ది రాజాసాబ్’, రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ క్లాష్ కన్ఫామ్ అయిపోయింది. కొందరు బాలీవుడ్ అభిమానులు ప్రభాస్ మూవీ వాయిదా వేసుకోవాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అలాంటి వారికి ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. “ప్రభాస్తో పోటీపడి షారుక్ఖానే నిలబడలేకపోయారు. సలార్తో పోటీగా రిలీజైన ‘డుంకీ’కి ఏమైందో అప్పుడే మర్చిపోయారా?”అంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.
News July 7, 2025
ఉగ్రవాదంపై BRICS సదస్సులో తీర్మానం

BRICS దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. కౌంటర్ టెర్రరిజంపై తీర్మానం కూడా చేశాయి. ‘క్రాస్ బోర్డర్ టెర్రరిజం సహా అన్ని రకాల ఉగ్రవాద చర్యల కట్టడికి పోరాడతాం. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరిని ఉపేక్షించం. ఉగ్రమూకల అణచివేతలో దేశాల ప్రాథమిక బాధ్యతను గుర్తు చేస్తున్నాం. ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం’ అని బ్రిక్స్ దేశాలు తీర్మానించాయి.