News August 29, 2024
షుగర్ పేషెంట్స్ చెప్పులు/షూస్ లేకుండా నడవొద్దు: వైద్యులు

డయాబెటిక్ వ్యాధిగ్రస్థులకు గాయాలు త్వరగా మానవు. వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పులు లేకుండా నడవొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ‘డయాబెటిక్స్లో పాదాల ఇన్ఫెక్షన్, గ్యాంగ్రీన్ వంటివి జరుగుతాయి. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల గాయం మానదు. గాయాల నొప్పి తెలియదు. దీని వల్ల మరింత నష్టం జరుగుతుంది. కాలు ధమనులలో అడ్డంకులు ఏర్పడి గాయం నయంకాదు’ అని సూచించారు. చెప్పులకు బదులు షూస్ ధరిస్తే ఇంకా మంచిది.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


