News January 29, 2025
బెంజ్ కారుకు 100 ఏళ్ల చరిత్ర ఉందని మీకు తెలుసా?

మార్కెట్లో ఎన్నో రకాల కార్ల కంపెనీలు ఉండగా కొందరు మైలేజ్ చూస్తే.. మరికొందరు సేఫ్టీ చూస్తుంటారు. టాప్లో ఉన్న కార్ల కంపెనీలు ఏయే సంవత్సరాల్లో మొదలు పెట్టారో చాలా మందికి తెలియదు. ఇండియన్ కంపెనీ అయిన టాటా మోటార్స్ను 1945లో స్థాపించారు. 2003లో టెస్లా, హ్యుందాయ్ 1967, హోండా 1948, కియా 1944 , టయోటా 1935, నిస్సాన్ 1933, మెర్సిడెస్ బెంజ్ 1926, బెంట్లీ 1919, BMWని 1916లో ప్రారంభించారు.
Similar News
News February 9, 2025
రోహిత్ ఫామ్పై ఆందోళన లేదు: బ్యాటింగ్ కోచ్

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ గురించి తమకు ఆందోళన లేదని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. ‘రోహిత్కు వన్డేల్లో 31 సెంచరీలున్నాయి. గత వన్డే సిరీస్లో(vsSL) 56, 64, 35 పరుగులు చేశాడు. టెస్టుల్లో విఫలమయ్యాడు కానీ వన్డేల్లో రన్స్ చేస్తూనే ఉన్నాడు. అతడి బ్యాటింగ్తో మాకు ఏ సమస్యా లేదు’ అని ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు.
News February 9, 2025
మహారాష్ట్రలో పెరుగుతున్న GBS కేసులు

మహారాష్ట్రలో తాజాగా మరో 3 <<15225307>>గిలియన్ బార్ సిండ్రోమ్<<>> కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 183కు చేరింది. 6 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 151 మంది కోలుకున్నారు. ఇటీవల ముంబైలోనూ GBS తొలి కేసు నమోదైంది. 64 ఏళ్ల వృద్ధురాలికి ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంధేరి తూర్పు ప్రాంతంలో నివసించే ఆ మహిళకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News February 9, 2025
నేడు బీఆర్ఎస్ ‘బీసీ’ సమావేశం

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం పోరాడాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై ఇవాళ బీసీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కేటీఆర్ ‘బీసీ’ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో జరిగే ఈ భేటీలో కులగణన సర్వే నివేదిక, 42% రిజర్వేషన్ అమలుతో పాటు ఇతర సమస్యలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.