News May 4, 2024

మోదీ రెండు చోట్ల పోటీ చేయలేదా?: జైరామ్

image

రాహుల్ గాంధీ LS ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయడంపై BJP చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ స్పందించారు. మోదీ రెండు స్థానాల్లో పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. BJP నుంచి సుష్మా స్వరాజ్, అటల్ బిహారీ వాజ్‌పేయీ 2 స్థానాల్లో పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అమేథీ, రాయ్‌బరేలీ సంప్రదాయ స్థానాలు అని అమిత్‌ షా అన్నారని, అందుకే రాహుల్‌ అక్కడ పోటీ చేస్తున్నారని జైరామ్ పేర్కొన్నారు.

Similar News

News March 30, 2026

జనగణన.. సహజీవన జంటలకు కుటుంబ హోదా

image

దేశంలో ఎల్లుండి నుంచి కేంద్రం జనగణన చేపట్టనుంది. సహజీవన జంటలకు కూడా కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు తెలిపింది. చాలాకాలంగా కలిసి ఉంటున్న వారిని మ్యారీడ్ కపుల్‌గా గుర్తిస్తామని పేర్కొంది. అందుకు ఎటువంటి ఆధారాలు అవసరం లేదని, కాకపోతే ఆ జంట అనుమతి తప్పనిసరని వెల్లడించింది. గతంలో పెళ్లికాని జంటలు తమను తాము వివాహితులుగా నమోదు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 33 ప్రశ్నలతో జనగణన సాగనుంది.

News March 30, 2026

ఏప్రిల్ 4వ వారంలో టెన్త్ ఫలితాలు

image

AP: టెన్త్ పరీక్ష ఫలితాలు APR 4వ వారంలో విడుదల చేసేందుకు SSC బోర్డు చర్యలు చేపట్టింది. APR2తో పరీక్షలు ముగుస్తాయి. జవాబు పత్రాల మూల్యాంకనం 6-15 తేదీ వరకు జరుగుతుంది. అనంతరం OMR స్కానింగ్ ఉంటుంది. ఆన్సర్ షీట్లలో తేడాలుంటే వెరిఫికేషన్‌కు జిల్లాలను సంప్రదించడం, వాల్యుయేషన్ పత్రాల ర్యాండమ్ చెకప్ అనంతరం కంప్యూటరీకరణ చేస్తుంది. ఇవి పూర్తయ్యాక 30లోపు రిజల్ట్స్ ప్రకటిస్తామని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

News March 30, 2026

వాహనదారులకు షాక్.. పెరిగిన CNG ధర

image

TG: CNG వాహనదారులకు షాక్ తగిలింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దిగుమతికి ఆటంకంతో సరఫరా మరింత తగ్గింది. ఇదే సాకుతో గ్యాస్ కంపెనీలు ధరలు పెంచేస్తున్నాయి. 3 రోజుల క్రితం వరకు కిలోపై అదనంగా ₹1 చొప్పున వసూలు చేసిన HYDలోని ఓ PVT గ్యాస్ కంపెనీ ఆ తరువాత నుంచి మరో రూ.2 పెంచి విక్రయిస్తోంది. వారం కిందట ఈ ధర ₹96గా ఉండగా శనివారం నుంచి అన్ని బంకుల్లో KG ₹99 చొప్పున CNG స్టేషన్లలో వసూలు చేస్తున్నారు.