News May 4, 2024

మోదీ రెండు చోట్ల పోటీ చేయలేదా?: జైరామ్

image

రాహుల్ గాంధీ LS ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయడంపై BJP చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ స్పందించారు. మోదీ రెండు స్థానాల్లో పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. BJP నుంచి సుష్మా స్వరాజ్, అటల్ బిహారీ వాజ్‌పేయీ 2 స్థానాల్లో పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అమేథీ, రాయ్‌బరేలీ సంప్రదాయ స్థానాలు అని అమిత్‌ షా అన్నారని, అందుకే రాహుల్‌ అక్కడ పోటీ చేస్తున్నారని జైరామ్ పేర్కొన్నారు.

Similar News

News December 11, 2025

జగిత్యాల: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

image

మేడిపల్లి మండలం కొండాపూర్, భీమారం మండలం కమ్మరిపేట, కోరుట్ల మండలం సంగెం, నాగులపేట, ఐలాపూర్, మెట్ పల్లి మండలం వెల్లుల్ల, జగ్గాసాగర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ తదితర గ్రామాలలో కలెక్టర్ సత్య ప్రసాద్ గురువారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న సరళిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, ఆర్డిఓలు తదితరులున్నారు.

News December 11, 2025

క్యాబినెట్ భేటీకి ఆలస్యం.. మంత్రులపై CM ఆగ్రహం

image

AP: క్యాబినెట్ భేటీకి లేట్‌గా వచ్చిన రామనారాయణ రెడ్డి, సంధ్యారాణి, వాసంశెట్టి సుభాశ్ సహా మరో మంత్రిపై CBN ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘క్యాబినెట్ లాంటి కీలక భేటీకి ఆలస్యం కావడం ఏమిటి? డిసిప్లిన్ లేకపోతే ఎలా?’ అని ప్రశ్నించారు. కమ్యూనికేషన్ లోపంతో ఆలస్యం అయ్యామని మంత్రులు చెప్పగా మళ్లీ రిపీట్ కాకూడదని స్పష్టం చేశారు. కాగా కొందరు మంత్రులు గ్రౌండ్‌వర్క్ చేయడం లేదని CBN అసంతృప్తి వ్యక్తంచేశారని సమాచారం.

News December 11, 2025

చెరువుల్లో నీటి నాణ్యత – చేపలపై ప్రభావం

image

చెరువుల్లో నీరు ఎంత నాణ్యంగా ఉంటే చేపలు అంత ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతాయి. నీటి నాణ్యత చెడిపోతే చేపల్లో ఒత్తిడి, వ్యాధులు, మరణాలు సంభవిస్తాయి. చేపలు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం లీటరు నీటికి 5 మి.గ్రా. DO(డిసాల్వ్ ఆక్సిజన్) ఉండాలి. ఇది 3 మి.గ్రా. కంటే తక్కువైతే చేపలు బలహీనపడతాయి, 1 మి.గ్రా. కన్నా తక్కువైతే చేపలు చనిపోవచ్చు. తెల్లవారుజామున, మబ్బు వాతావరణం, వర్షపు రోజుల్లో డిఓ తక్కువగా ఉంటుంది.